అఫీషియల్.. ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి కూతురు

ఎన్టీఆర్-కొరటాల కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకున్నారనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర చాన్నాళ్ల కిందటే బ్రేక్ చేసింది. ఇప్పుడదే విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది.…

ఎన్టీఆర్-కొరటాల కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకున్నారనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర చాన్నాళ్ల కిందటే బ్రేక్ చేసింది. ఇప్పుడదే విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనుంది. ఈమెకు తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ మేరకు మేకర్స్ నుంచి జాన్వి కపూర్ ఎంట్రీని తెలియజేస్తూ ఓ పోస్టర్ వచ్చింది. సినిమాలో జాన్వి లుక్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఈ పోస్టర్ తో చిన్న క్లారిటీ ఇచ్చారు. 'తుపానులో నిశ్శబ్దం' అనే క్యాప్షన్ కూడా తగిలించారు.

జాన్వి కపూర్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు ఇంతకుముందు చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. అంతెందుకు, గతంలో ఎన్టీఆర్ చేసిన ఓ సినిమా కోసం జాన్వి కపూర్ ను గట్టిగా ట్రై చేశారు. కానీ ఏ ప్రయత్నాలూ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ఆమె ఎన్టీఆర్ సినిమాతోనే టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.

ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కొరటాల ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా ఈ సినిమా, నెలాఖరు నుంచి సెట్స్ పైకి రాబోతోంది. 2024, ఏప్రిల్ 5న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారు.