Advertisement

Advertisement


Home > Movies - Movie News

జగన్ వైరం కలిపింది ఇద్దరినీ!

జగన్ వైరం కలిపింది ఇద్దరినీ!

హీరో నాని కోసం కదలి వస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సాధారణంగా వేరే వాళ్ల సినిమా ఫంక్షన్ కు పవన్ రావడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. 

అసలే పొలిటికల్ గా బిజీగా వున్నారు. తన స్వంత సినిమాలు సైతం పక్కన పడేసారు. కానీ అంటే సుందరానికి ఫంక్షన్ కు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని వెనుక ఓ కామన్ పాయింట్ వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా టికెట్ ల గడబిడ నడుస్తున్నపుడు వినిపించిన గొంతులు రెండే. ఒకటి పవన్..రెండవది నాని. ముందుగా పవన్ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో గొంతెత్తారు. కానీ ఎవ్వరూ మద్దతుగా మాట్లాడలేదు. కానీ నాని మాత్రం తన సినిమా ఫంక్షన్ లో గొంతు కలిపారు.

అదే విధంగా సినిమా టికెట్ రేట్ల వల్ల ఇబ్బంది పడింది ఇద్దరు హీరోలే. ఒకరు పవన్..రెండు నాని. మిగిలిన హీరోల సినిమాలు ఆ రోజుల్లో కామన్ రేట్లు అమ్మినా, ఎక్కువ అమ్మినా పట్టించుకోలేదు. 

ఆ విధంగా జగన్ బాధితులు లేదా వ్యతిరేకులు ఈ ఇద్దరూ. ఆ విధంగా ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. కానీ ఇప్పుడు మాట్లాడడానికి టికెట్ ల సమస్య లేదు. అందువల్ల సినిమా సంగతులు మాట్లాడి ముగించడమే.

అన్నట్లు మైత్రీ సంస్థ కు పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సి వుంది. అది అలా అలా వెనక్కు వెళ్తూనే వుంది. ఇచ్చిన అడ్వాన్స్ కు వడ్డీల కట్టుకుంటూ నిర్మాతలు కాలక్షేపం చేస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?