Advertisement

Advertisement


Home > Movies - Movie News

జాన్వి కపూర్ Vs పూజా హెగ్డే?

జాన్వి కపూర్ Vs పూజా హెగ్డే?

మైత్రీ మూవీ మేకర్స్ తమిళ్ లో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అజిత్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ కూడా ప్రకటించారు.

ఇప్పుడీ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇందులో అజిత్ సరసన జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు పూజా హెగ్డే పేరు కూడా అదే స్థాయిలో వినిపిస్తోంది.

నిజానికి 'మైత్రీ' తలుచుకుంటే... వీళ్లిద్దర్లో ఎవరినైనా ఇట్టే లాక్ చేయగలదు. ఎందుకంటే జాన్వి కపూర్ ను ఆల్రెడీ చరణ్ సినిమా కోసం తీసుకున్నారు. ఇక పూజాహెగ్డేతో చాన్నాళ్లుగా మంచి రిలేషన్ షిప్ ఉంది. కాబట్టి ఎవరు కావాలంటే వాళ్లను తీసుకునే వెసులుబాటు ఉంది.

అయితే ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న జాన్వి, ఇప్పుడిప్పుడు బిజీ అవుతోంది. త్వరలోనే చరణ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది. అటు బాలీవుడ్ ప్రాజెక్టు కూడా చేతిలో ఉంది. అజిత్ సినిమాను జూన్ నుంచి ప్రారంభించాలనేది మేకర్స్ ఆలోచన. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనేది టార్గెట్.

ఇలాంటి టైమ్ లో జాన్వి కపూర్ ను తీసుకుంటే టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం కావొచ్చు. అటు పూజాహెగ్డే రీసెంట్ గా ఓ హిందీ సినిమాకు సైన్ చేసింది. అయినప్పటికీ ఆమె దగ్గర బోలెడంత టైమ్, కాల్షీట్లు ఉన్నాయి. దర్శకనిర్మాతలు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?