కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్

సరిగ్గా 3 వారాల కిందట తన ఎంగేజ్ మెంట్ రింగ్ ను చూపించింది రాధ కూతురు కార్తీక. తను పెళ్లి చేసుకోబోతున్నట్టు  ప్రకటించింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఆమె అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు…

సరిగ్గా 3 వారాల కిందట తన ఎంగేజ్ మెంట్ రింగ్ ను చూపించింది రాధ కూతురు కార్తీక. తను పెళ్లి చేసుకోబోతున్నట్టు  ప్రకటించింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఆమె అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది ఈ బ్యూటీ.

తన కాబోయే భర్తతో దిగిన ఫొటోల్ని షేర్ చేసింది కార్తీక. అతడి పేరు రోహిత్ మీనన్. అంతకుమించి అతడికి సంబంధించిన వివరాల్ని ఆమె బయటపెట్టలేదు.

“నిన్ను కలవడం విధి. నీకు పడిపోవడం ఓ మేజిక్. మన జీవిత ప్రయాణానికి కౌంట్ డౌన్ మొదలైంది.” అంటూ పోస్ట్ పెట్టింది కార్తీక. దీంతో అతి త్వరలోనే ఆమె పెళ్లి ఉందనే విషయం నిర్థారణ అయింది. రీసెంట్ గా కార్తీక, ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. అది పెళ్లికి రిహార్సల్ అనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది.

కూతురు పెళ్లికి సంబంధించి తల్లి రాధ ఆల్రెడీ పెళ్లి పిలుపులు మొదలుపెట్టింది. ఈమధ్య హైదరాబాద్ వచ్చి కొంతమందికి శుభలేఖలు అందించింది. వీళ్లలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాఘవేంద్రరావు లాంటి ప్రముఖులున్నారు.

రాధ నటవారసురాలిగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కార్తీక. అయితే అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆమె కెరీర్ లో రంగం అనే సినిమా మాత్రమే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో యాక్టింగ్ కెరీర్ పక్కనపెట్టేసింది. అలా వెండితెరకు దూరమైన ఈ బ్యూటీ, ఇప్పుడు పెళ్లితో వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతోంది.