Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహేశ్ ను బోకు అన్నప్పుడు గుండె ఆగిపోయింది

మహేశ్ ను బోకు అన్నప్పుడు గుండె ఆగిపోయింది

మహేష్ బాబు సినిమాల్లో ఊహించని సన్నివేశం, ఊహించని డైలాగ్ ఒకటి సర్కారువారి పాటలో ఉంది. హీరోయిన్ వచ్చి, హీరోను మొహం మీద తిట్టే సీన్ అది. మహేష్ సినిమాల్లో హీరోయిన్లు ఆటోమేటిగ్గా పడిపోతారు, ఇలా మీద పడి తిట్టరు. కానీ సర్కారువారి పాటలో మహేష్ ను కీర్తిసురేష్ తిట్టాల్సి వచ్చింది. పైగా 'బోకు' అనే పదాన్ని వాడాల్సి వచ్చింది.

ఆ అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది కీర్తిసురేష్. మహేష్ ను తిడుతున్నప్పుడు గుండె ఆగిపోయిందని చెప్పుకొచ్చింది. ఆ సీన్ చూసి మహేష్ ఫ్యాన్స్ తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తారేమోనని భయపడింది.

"మహేష్ గారి మొహం చూసి, మొహం మీద చేయి చూపించి బోకు అని తిట్టాలి. నా వల్ల కాలేదు. ముందు మెల్లగా చెప్పాను. డైరక్టర్ ఒప్పుకోలేదు. మొహం మీదకు చేయి చూపించి బోకు అని తిట్టు అన్నారు. నాకు గుండె ఆగిపోయింది. మహేష్ ఫ్యాన్స్ ఏమంటారో అనే భయం వేసింది. మొత్తానికి ఎలాగోలా ఆ సీన్ చేశాను. కానీ మహేష్ ఫ్యాన్స్ ఏమంటారో అనే భయం నాకు ఇప్పటికీ ఉంది."

ఇలా 'బోగ్గాడు సన్నివేశం' వెనక జరిగిన తతంగాన్ని బయటపెట్టింది కీర్తిసురేష్. ఈ ఎపిసోడ్ పై మహేష్ కూడా రియాక్ట్ అయ్యాడు. తనను కీర్తిసురేష్ సరిగ్గా తిట్టలేదని, దీంతో ఒక దశలో తనే వెళ్లి తిట్టమని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చిందన్నాడు.

"2-3 టేకులయ్యాయి. ఆమె నన్ను తిట్టలేకపోతోంది. ఓవైపు దుబాయ్ లో ఎండ మండిపోతోంది. సీన్ ఓకే అవ్వడం లేదు. దీంతో నేనే కీర్తి దగ్గరకెళ్లి, నన్ను తిట్టు, తిట్టు అని మొరపెట్టుకున్నాను. పక్క నుంచి డైరక్టర్ కూడా తిట్టు తిట్టు అని గట్టిగా చెప్పడంతో ఆ సీన్ వచ్చింది."

సినిమాలో ఈ సీన్ చూసి మహేష్ కూతురు సితార పడిపడి నవ్విందంట. దాదాపు 15 నిమిషాల సేపు అలా నవ్వుతూనే ఉందట. సితార అంతలా నవ్వడం తాను ఎప్పుడూ చూడలేదన్నాడు మహేష్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?