పవన్‌కళ్యాణ్ ఎలాగో రాడులే అని

పవన్‌కళ్యాణ్ తిరిగి నటించడం మొదలు పెట్టిన తర్వాత కదనోత్సాహంతో రెండు సినిమాల షూటింగ్స్‌లో ఏకధాటిగా పాల్గొన్నాడు. వకీల్ సాబ్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో జానపద చిత్రాన్ని పవన్ మొదలుపెట్టాడు. అయితే లాక్ డౌన్ టైమ్‌లో…

పవన్‌కళ్యాణ్ తిరిగి నటించడం మొదలు పెట్టిన తర్వాత కదనోత్సాహంతో రెండు సినిమాల షూటింగ్స్‌లో ఏకధాటిగా పాల్గొన్నాడు. వకీల్ సాబ్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో జానపద చిత్రాన్ని పవన్ మొదలుపెట్టాడు. అయితే లాక్ డౌన్ టైమ్‌లో ఈ రెండు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ‘వకీల్ సాబ్’ పూర్తి చేసేసి, ఈ చిత్రం మొదలు పెట్టాలని అనుకున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఏదో దీక్ష చేబట్టి ఇప్పట్లో సెట్స్‌కి రాలేనని స్పష్టం చేయడంతో ‘వకీల్‌సాబ్’ చిత్రం విడుదల వచ్చే వేసవికి వాయిదా వేసుకున్నారని సమాచారం. దీంతో క్రిష్ చిత్రం మళ్లీ మొదలవడానికి చాలా సమయం పడుతుంది. అంతవరకు సమయం వృధా చేసుకోవడం దేనకని క్రిష్ ఈలోగా ఒక మీడియం బడ్జెట్ సినిమా తలపెట్టాడు.

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందే ఈ చిత్రం క్రిష్ మిగతా చిత్రాల మాదిరిగానే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోందట. అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలు పెట్టేస్తున్నారు. పవన్‌తో సినిమా వుంటే ఈలోగా చిన్న సినిమా చేయాలని ఎవరూ అనుకోరు. కానీ క్రిష్ ప్రాక్టికల్‌గా ఆలోచించి టైమ్ వేస్ట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. 

ఇదీ జగన్ విజన్

స్వర్ణ ప్యాలెస్.. మన వాళ్ళే