రాముడికి సీత దొరికేసింది

ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో హీరోయిన్ ఎవరనే విషయంపై మొన్నటివరకు ఓ ప్రచారం జోరుగా సాగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ ను తీసుకున్నారంటూ బాలీవుడ్…

ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో హీరోయిన్ ఎవరనే విషయంపై మొన్నటివరకు ఓ ప్రచారం జోరుగా సాగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ ను తీసుకున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయం నిజమైంది.

ఆదిపురుష్ లో కృతి సనన్ ఎంట్రీని మేకర్స్ కొద్దిసేపటి కిందట అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని కృతి కూడా నిర్థారించింది. ప్రభాస్ తో కలిసి దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేసింది.

తాజా ప్రకటనతో ఆదిపురుష్ లో కీలక పాత్రధారులు ఎవరనే విషయం తేలిపోయింది. సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే ముంబయిలో షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

తెలుగులో మహేష్ బాబు సరసన వన్-నేనొక్కడినే సినిమాలో నటించింది కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో ఓ సినిమా చేసి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆదిపురుష్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.

నిజానికి ఈ సినిమాలో సీత పాత్ర కోసం అనుష్క, కీర్తిసురేష్, కియరా అద్వానీ లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. తను సీతగా నటించడం లేదని అనుష్క గతంలోనే క్లారిటీ ఇచ్చింది. నిన్నమొన్నటివరకు కీర్తిసురేష్ పేరు వినిపించింది. తాజాగా అన్ని పుకార్లకు చెక్ పడింది. 

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జాతి రత్నాలు మూవీ పబ్లిక్ టాక్