Advertisement

Advertisement


Home > Movies - Movie News

మానాడు కోసం పోటా పోటీ

మానాడు కోసం పోటా పోటీ

పరభాషా సినిమా కాస్త బాగుంటే చాలు హక్కుల కోసం పోటీ పడడం టాలీవుడ్ లో మళ్లీ మొదలైంది. మలయాళం, తమళ సినిమాలు చేతిలో వుంటే హీరోలను పట్టుకోవడం సులువు అవుతోంది. మెగాస్టార్, పవన్ కళ్యాణ్, వెంకటేష్ లాంటి సీనియర్లు రీమేక్ లు అంటే రెడీ అయిపోతున్నారు. 

ఇటీవల తమిళ్ లో విడుదలయిన సినిమా మానాడు. వెంకట్ ప్రభు దర్శకుడు. సింబు హీరో. ఇప్పుడు ఈ సినిమా హక్కుల కోసం తెలుగు నిర్మాతలు పోటీ పడడం ప్రారంభించారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సురేష్ బాబు, సితార ఎంటర్ టైన్ మెంట్స్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. 

అయితే మానాడు సినిమా రీమేక్/డబ్బింగ్ హక్కులు హీరో సింబు దగ్గర వున్నాయని తెలుస్తోంది. ఆయన ఇది తెలుగులో నేరుగా డబ్ చేసి విడుదల చేయాలని చూస్తున్నట్లు బోగట్టాయి. 

అందువల్ల తెలుగు హక్కులు కావాలంటే కాస్త ఎక్కువ మొత్తమే ఆఫర్ చేయాల్సి వుంటుంది. అందువల్ల ఈ రేస్ లో ఎవరు క్లిక్ అవుతారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?