మహేష్ సినిమాకు మూడు భారీ సెట్లు

సూపర్ స్టార్ మహేష్-త్రివిక్రమ్ కాంబో సినిమా ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయ. వీలైతే ఈ నెలలో లేదంటే జనవరి నుంచి సెట్ మీదకు వెళ్తుందీ సినిమా.  Advertisement మూడు భారీ సెట్లు అవసరం కావడమే…

సూపర్ స్టార్ మహేష్-త్రివిక్రమ్ కాంబో సినిమా ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయ. వీలైతే ఈ నెలలో లేదంటే జనవరి నుంచి సెట్ మీదకు వెళ్తుందీ సినిమా. 

మూడు భారీ సెట్లు అవసరం కావడమే ఇందుకు కారణం. అందులో కీలకమైన ఓ సెట్ ను నగర శివార్లలో నిర్మిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం భారీ సెట్ వేసిన ప్రదేశంలోనే ఈ సెట్ తయారవుతోంది.

సర్కారు వారి పాట సినిమా తరువాత సినిమా చేయడానికి మహేష్ కు కొంచెం ఎక్కువ టైమ్ నే పడుతోంది. త్రివిక్రమ్ సరైన స్క్రిప్ట్ ను మహేష్ కు సకాలంలో చెప్పలేకపోవడమే కారణం తప్ప వేరు కాదని టాక్. మొదట ఓ స్క్రిప్ట్ చెప్పడం, దాని కోసం ఓ ఫైట్ సీన్ తీసి, పక్కన పడేసి కొత్త స్క్రిప్ట్ చెప్పడం అన్నీ జరిగాయి.

నారి నారి నడుమ మురారి అన్నట్లుగా పూజా హెగ్డే..శ్రీలీల నడుమ మహేష్ బాబు నటించే సినిమా ఇది. పక్కా ఫ్యామిలీ, ఫన్, ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో నడుస్తుంది. పిఎస్ వినోద్, థమన్, ఎ ఎస్ ప్రకాష్ కీలక సాంకేతిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్, ఇతర డిస్కషన్లు దుబాయ్ లో జరుగుతున్నాయి. నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు, ఇంకా కీలక టెక్నికల్ టీమ్ అంతా దుబాయ్ లోనే వున్నారు.