Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ దిల్ వ‌ర్సెస్ మైత్రీ

మళ్లీ దిల్ వ‌ర్సెస్ మైత్రీ

నైజాం పంపిణీ రంగంలో ఎదురు లేకుండా ముందుకు సాగుతున్న నిర్మాత, పంపిణీదారుకు మైత్రీ ఫిలింస్ పంపిణీ సంస్థ కాస్త కొరకరాని కొయ్యగా తయారయింది. ఆర్థికంగా మంచి సపోర్ట్ వుండడంతో పాటు, సీరియస్ గా వర్క్ చేస్తూ, సినిమాల పంపిణీ విషయంలో మెట్టు మెట్టు ఎక్కుతోంది. దిల్ రాజు తన సినిమాలు లేదా తన పంపిణీ సినిమాలు వస్తుంటే, చాలా ప్లాన్డ్ గా వేరే సినిమాలు పెద్దగా పోటీ లేకుండా ఇన్నాళ్లూ చూసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యం కావడం లేదు.

దిల్ రాజు స్వంత సినిమా ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదలవుతోంది. విజయ్ దేవరకొండ- మృణాళ్- పరుశురామ్ కాంబినేషన్. దానికి ముందు వారం దిల్ రాజు పంపిణీ అయిన టిల్లు స్క్వేర్ విడుదలవుతోంది. దానికి పోటీగా మైత్రీ నుంచి పృధ్వీరాజ్ నటించి నిర్మించిన ‘గోట్ లైఫ్’ విడుదలవుతోంది. ఫ్యామిలీ స్టార్ కు పోటీగా  ఈ సినిమాలకు పోటీగా ఏప్రిల్ 6న మలయాళ డబ్బింగ్ సినిమా మంజుమ్మెల్ బాయిస్ వస్తోంది.

ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్. రెండు వందల కోట్లు వసూలు చేసింది. పలువురు స్నేహితులు అడ్వంచర్ టూర్ కు వెళ్లడం, అక్కడ ప్రమాదంలో చిక్కుకోవడం, ఎలా బయటపడ్డారనే ఉత్కంఠ నేపథ్యంలో ఈ సినిమా తీసారు. ఈ సినిమాను మలయాళంలో చూసిన వారు చూసారు కానీ తెలుగు రాష్ట్రాల్లో చూడని వారే ఎక్కువ. సినిమా పేరు ఇప్పటికే బాగా పాపులర్ అయింది. అలాంటి సినిమా ఇప్పుడు దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ మీద పడుతోంది.

డబ్బింగ్ సినిమా అని తీసేయడానికి లేదు. మన ప్రేక్షకులకు కాస్త నచ్చాలే కానీ డబ్బింగ్ సినిమా అయినా విరగబడి చూసిన సందర్భాలు వున్నాయి. ఈ సినిమాను మైత్రీ సంస్థ గట్టి పబ్లిసిటీతో దింపాలని ప్లాన్ చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేసే ఆలోచనలో వున్నారు. జనవరిలో గుంటూరుకారం-హనుమాన్ పోటీ పడ్డాయి. మళ్లీ సమ్మర్ లో ఈ పోటీ రసవత్తరంగా వుండబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?