ముగ్గురు కోసం.. ముగ్గురితో.. ముగ్గురు చుట్టూ..

మనమే ట్రయిలర్ రిలీజైంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేశాడు. సినిమా కథ ఏంటనే విషయం కంటే, పాత్రల ప్రయాణాన్ని ఎలివేట్ చేస్తూ ట్రయిలర్ కట్…

మనమే ట్రయిలర్ రిలీజైంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేశాడు. సినిమా కథ ఏంటనే విషయం కంటే, పాత్రల ప్రయాణాన్ని ఎలివేట్ చేస్తూ ట్రయిలర్ కట్ చేశారు. ట్రయిలర్ చూస్తుంటే, సినిమా కూడా ఎక్కువగా ఈ 3 పాత్రల చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది.

విభిన్న మనస్తత్వాలు కలిగిన 3 పాత్రల మధ్య ప్రేమ, వినోదం, భావోద్వేగాలను మనమే ట్రయిలర్ లో చూపించారు. ఎయిర్ హోస్టెస్ తో హీరో సరసాలాడ్డంతో ట్రయిలర్ ను ఫన్నీగా స్టార్ట్ చేశారు. హీరోను ఒక షేడ్ లో కేర్ లెస్ గా, మరో షేడ్ లో బాధ్యతాయుతమైన వ్యక్తిగా చూపించారు. రెండు షేడ్స్ లో చూపించినప్పటికీ, అతడిలో ఫన్ యాంగిల్ ను మాత్రం మిస్ చేయలేదు.

ఇక హీరోయిన్ కృతిశెట్టి పాత్రను సినిమా మొత్తం సీరియస్ మోడ్ లో చూపించినట్టున్నారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ, ప్రతిది పెర్ ఫెక్ట్ గా ఉండాలని భావించే అమ్మాయిగా నటించింది. ఇక మరో కీలక పాత్రలో చిన్నారి విక్రమ్ ఆదిత్య కనిపించాడు.

లండన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన విజువల్స్ బాగున్నాయి. హేషమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆహ్లాదకరంగా ఉంది. సినిమాలో అక్కడక్కడ యాక్షన్ కూడా ఉందనే విషయాన్ని ట్రయిలర్ ఎలివేట్ చేసింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, అతడితో పాటు హీరోహీరోయిన్లకు చాలా కీలకం. 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది మనమే సినిమా.