Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా మూవీలో బిజు మీనన్

మెగా మూవీలో బిజు మీనన్

ఎప్పుడో రవితేజ ఖతర్నాక్ లో, గోపీచంద్ 'రణం'  సినిమాలో విలన్ గా నటించాడు మలయాళ నటుడు బిజు మీనన్. అప్పటికి అతను ఎవ్వరికీ తెలియదు. కానీ అయ్యప్పన్ కోషియమ్ సినిమా పుణ్యమా అని అతగాడు ఇప్పుడు ఇంటిటికీ పరిచయం అయిపోయాడు. అందుకే బిజు మీనన్ ను మళ్లీ తెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 

మైత్రీ మూవీస్ సంస్థ ఈ ప్రయత్నాలు ప్రారంభించినట్లు బోగట్టా. మరో బిగ్ మూవీ కి కూడా ఇదే ప్లాన్ జరుగుతోంది.

మెగాస్టార్-బాబి కాంబినేషన్ లో తయారవుతున్న మైత్రీ మూవీస్ సినిమాలో సుముద్రఖని నటించాల్సి వుంది. కానీ పవన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. అందుకే ఇప్పుడు నటుడిగా చాలా సినిమాలు వదిలేసుకుంటున్నాడు. ఆ సినిమా అయిన తరువాతే మళ్లీ నటిస్తా అంటున్నాడట సముద్రఖని.  

అందువల్ల సముద్రఖనికి ఆల్టర్ నేటివ్ కావాల్సి వచ్చింది. బాబి-మెగాస్టార్ మూవీకి. బాబి దృష్టి అంతా భారీ భారీ విలన్ల మీద వుంది. వాళ్లను తీసుకుంటే ఓవరాల్ గా నాలుగైదు కోట్లు భారం పడుతుంది. అందుకే మైత్రీ మూవీస్ జనాలు బాబి ఐడియాను పక్కన పెట్టి, బిజును తీసుకురావడానికి చూస్తున్నారు. అలా అయితే ఒకటి రెండు కోట్లతో అయిపోతుందన్నది ఆలోచనగా తెలుస్తోంది.

ఇధి ఒకె అయితే మరో సినిమా హీరో సినిమాలో విలన్ పాత్ర కూడా బిజు కోసం రెడీగా వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?