తప్పుడు రాతలు.. సీరియస్ అయిన హీరోయిన్

బబ్లీ హీరోయిన్ మెహ్రీన్ కు కోపమొచ్చింది. ఓ సెక్షన్ మీడియాపై ఆమె విరుచుకుపడింది. ఇష్టమొచ్చిన రాతలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాంటూ హెచ్చరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. Advertisement రీసెంట్ గా మెహ్రీన్ ‘ఫ్రీజింగ్…

బబ్లీ హీరోయిన్ మెహ్రీన్ కు కోపమొచ్చింది. ఓ సెక్షన్ మీడియాపై ఆమె విరుచుకుపడింది. ఇష్టమొచ్చిన రాతలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాంటూ హెచ్చరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

రీసెంట్ గా మెహ్రీన్ ‘ఫ్రీజింగ్ ఎగ్స్’ ప్రక్రియ ద్వారా అండాల్ని భద్రపరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే ఓ సెక్షన్ మీడియా దీన్ని మరో విధంగా రాసుకొచ్చింది. దీనిపై మెహ్రీన్ సీరియస్ అయింది.

“ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం ఓ అమ్మాయి గర్భవతి కానవసరం లేదు. బాధ్యతాయుతమైన సెలబ్రిటీగా నా లక్ష్యం ఏంటంటే.. పిల్లలను కోల్పోయిన జంటలకు అవగాహన కోసం ఆ పోస్ట్ పెట్టాను. ఇక కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకునే అమ్మాయిలు, పెళ్లి చేసుకున్న తర్వాత, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని, బాధ్యతాయుతమైన తల్లులుగా మారడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడు శిశువును ప్లాన్ చేయడంపై అవగాహన కల్పించడం కోసం నేను ఆ పోస్ట్ పెట్టాను.”

అయితే తను పెట్టిన పోస్టుపై కొంతమంది తప్పుడు రాతలు రాస్తున్నారని, గర్భం దాల్చినట్టు వచ్చిన అలాంటి నివేదికలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడనని మెహ్రీన్ హెచ్చరిక జారీ చేసింది.

రిపోర్టర్లమని చెప్పుకునే కొంతమంది బాధ్యతారహిత వ్యక్తులు దిగజారి వార్తలు రాస్తున్నారని.. తనపై రాసిన తప్పుడు రాతల్ని వెంటనే డిలీట్ చేయాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మెహ్రీన్ డిమాండ్ చేసింది.