Advertisement

Advertisement


Home > Movies - Movie News

కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు నోట

కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు నోట

భక్త కన్నప్ప.. ఈ సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా కృష్ణంరాజు గుర్తొస్తారు. ఆ సినిమాలో ఆయన నటించడమే కాకుండా.. స్వయంగా ప్రభాస్ హీరోగా మరోసారి దాన్ని రీమేక్ చేద్దామని కూడా అనుకున్నారు. ఇప్పటికీ భక్త కన్నప్ప ప్రాజెక్టు అతడి చుట్టూనే తిరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. ఇప్పుడా సినిమాను మోహన్ బాబు ప్రస్తావించారు.

అవును.. భక్తకన్నప్ప సినిమాను తన కొడుకు మంచు విష్ణు తీస్తున్నాడని ప్రకటించాడు మోహన్ బాబు. మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా భక్త కన్నప్ప సినిమా వస్తోందని ప్రకటించాడు. ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో ఆ సినిమా తీస్తానంటూ శివరాత్రి సందర్భంగా మంచు మోహన్ బాబు ప్రకటించారు.

"దాదాపు 60 కోట్ల రూపాయల ఖర్చుతో విష్ణువర్థన్ బాబు కన్నప్ప అనే సినిమా తీస్తున్నాడు. ఇంతకుముందు వచ్చిన చిత్రాలు వేరు, విష్ణు తీయబోతున్న సినిమా వేరు. 4 సంవత్సరాల నుంచి విష్ణు ఈ కథ మీద కూర్చున్నాడు. రకరకాల గెటప్స్ ప్రయత్నిస్తున్నాడు. కన్నప్ప మరో అత్యద్భుతమైన గొప్ప చిత్రం అవుతుంది."

ప్రస్తుతం తన భార్య వెరొనికా నిర్మాతగా మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా తర్వాత కన్నప్ప ప్రాజెక్టు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అంతా బాగానే ఉంది కానీ నాలుగేళ్ల నుంచి నలుగుతుందని చెబుతున్న ఈ ప్రాజెక్టు, ఈ ఏడాదైనా సెట్స్ పైకి వస్తుందా అనే విషయాన్ని మాత్రం మోహన్ బాబు చెప్పలేదు.

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?