వెంకటేష్ కెరీర్ లో ఖరీదైన క్లైమాక్స్

కెరీర్ లో ఇప్పటివరకు 74 సినిమాల్లో నటించాడు వెంకటేష్. ఇప్పుడు తన మైల్ స్టోన్ 75వ చిత్రంలో నటిస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు సైంధవ్. Advertisement తాజాగా ఈ…

కెరీర్ లో ఇప్పటివరకు 74 సినిమాల్లో నటించాడు వెంకటేష్. ఇప్పుడు తన మైల్ స్టోన్ 75వ చిత్రంలో నటిస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు సైంధవ్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ పార్ట్ ను షూట్ చేశారు. వెంకీ కెరీర్ లోనే అత్యంత కాస్ట్ లీ క్లయిమాక్స్ ఇది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

క్లైమాక్స్ లో భాగంగా కీలకమైన 8 మంది నటీనటులతో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేశారు. నైట్ షిఫ్టులు, భారీ వర్షాల్ని సైతం లెక్కచేయకుండా ఈ క్లైమాక్స్ పార్ట్ షూట్ పూర్తిచేసినట్టు తెలిపాడు దర్శకుడు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను రామ్-లక్ష్మణ్ మాస్టర్లు సూపర్ వైజ్ చేశారు.

ఈ సినిమాతో నవాజుద్దీన్ సిద్ధిఖి, టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. శ్రద్ధా శ్రీనాధ్, రుహానీ శర్మ, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకీతో సహా, వీళ్లందరి ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. త్వరలోనే టీజర్ ను లాంచ్ చేస్తారు.

ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో సినిమాను రిలీజ్ చేస్తారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తున్నాడు సైంధవ్.