నాగబాబు.. తప్పు ఒప్పుకున్నట్లేనా?

పట్టుమని మూడు నాలుగు రోజులు ఉండలేకపోయారు జనసేన నాయకుడు నాగబాబు ట్విట్టర్ లేకుండా. ఆవేశంలో ఓ ట్వీట్ వేసి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి విపరీతంగా ట్రోల్స్ కు గురై, తన ట్విట్టర్ అక్కౌంట్…

పట్టుమని మూడు నాలుగు రోజులు ఉండలేకపోయారు జనసేన నాయకుడు నాగబాబు ట్విట్టర్ లేకుండా. ఆవేశంలో ఓ ట్వీట్ వేసి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి విపరీతంగా ట్రోల్స్ కు గురై, తన ట్విట్టర్ అక్కౌంట్ ను డీ యాక్టివేట్ చేసారు. మళ్లీ అంతలోనే ఈరోజు ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యారు. అంతే కాదు. వెనక్కు వస్తూనే..’ ఆ ట్వీట్ డిలీట్ చేసాను’ అంటూ ట్వీట్ వేసారు. ఆ ట్వీట్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనుకున్నారేమో.

‘’మాతో వుంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మా వాడైనా పరాయావాడే’’ అంటూ నాగబాబు వేసిన ట్వీట్ దుమారం లేపింది. తన మిత్రుడైన వైకాపా అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్లిన నేపథ్యంలో నాగబాబు ఈ ట్వీట్ వేయడం, అది బన్నీని ఉద్దేశించే అన్నది క్లారిటీగా తెలియడంతో, ఫ్యాన్స్ విపరీతంగా విరుచుకుపడ్డారు.

గతంలో నాగబాబు ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నపుడు ఆదుకున్నది బన్నీ నే. గతంలో జనసేనకు రెండు కోట్ల విరాళం ఇచ్చింది బన్నీనే. ఇవన్నీ తెలిసి నాగ బాబు ఇలా చేయడం ఏమిటి అన్న విమర్శలు వెలువడ్డాయి. దీంతో నాగబాబు తన ట్విట్టర్ అక్కౌంట్ డీ యాక్టివేట్ చేసుకున్నారు. ఇప్పుడు అంతలోనే మళ్లీ వచ్చారు.

రావడం కాదు కానీ, వస్తూనే ఆ పాత ట్వీట్ డిలీట్ చేసుకోవడం ద్వారా నాగబాబు తను తప్పు చేసాను అని ఒప్పుకున్నట్లు అయింది. మాట తొందరపాటు, దుడుకుతనం, ఇలాంటి చాలా అవలక్షణాలు నాగబాబుకు వున్నాయని అంటారు చాలా మంది. ఇప్పుడు మరోసారి రుజువు అయింది అది.