కరోనా కంటే ప్రమాదకరం బాలయ్య పాట

ఓ పాట ప్రాక్టీస్ చేస్తున్నానని, త్వరలోనే వదుల్తానంటూ 4 రోజులుగా ఊరించిన బాలయ్య.. చెప్పినట్టుగానే జగదేకవీరుని కథ సినిమాలోంచి శివశంకరి పాటను పాడి వదిలారు. అయితే దీనిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది.…

ఓ పాట ప్రాక్టీస్ చేస్తున్నానని, త్వరలోనే వదుల్తానంటూ 4 రోజులుగా ఊరించిన బాలయ్య.. చెప్పినట్టుగానే జగదేకవీరుని కథ సినిమాలోంచి శివశంకరి పాటను పాడి వదిలారు. అయితే దీనిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. క్లాసికల్ సాంగ్ ను భ్రష్టు పట్టించారంటూ చాలామంది విరుచుకుపడుతున్నారు. దీనిపై నందమూరి ఫ్యాన్స్ కూడా మౌనం వహించారు. ఇప్పుడీ సాంగ్ పై నాగబాబు రెస్పాండ్ అయ్యారు.

రీసెంట్ గా బాలయ్య వ్యాఖ్యలపై విరుచుకుపడిన నాగబాబు.. ఇప్పుడు బాలయ్య పాడిన పాటపై కూడా సెటైర్లు వేశారు. కరోనా కంటే ప్రమాదకరంగా బాలయ్య పాట ఉందని కామెంట్ చేశారు.

“కారోన జబ్బు కన్నా ప్రమాదకరమైన సంగీతం circulate అవుతుందిరా అయ్యా. జాగ్రత్తరా అయ్యా..దండం పెడతాను…అయ్యబాబోయ్ చిన్న పిల్లలని old age వాళ్ళని,హెల్త్ బాగాలేని వాళ్ళని సంగీతం వినకుండా చూసుకోండి. విన్నారంటే ఏదైన జరగొచ్చు…..అయినా ఎందయ్యా ఇది..ఇది నేను చూళ్లే..ఎక్కడ ఇనలే.” అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు నాగబాబు.

బాలయ్య పాటపై వర్మ ఇప్పటికే తనదైన స్టయిల్ లో స్పందించాడు. ఇప్పుడు నాగబాబు కూడా బాలయ్య పాటపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే నాగబాబు దాన్ని డిలీట్ చేశారు. అయితే అప్పటికే అది వైరల్ అయింది. 

‘జగనన్న చేదోడు’ ప్రారంభం

జగన్ గారికి చాలా థాంక్స్