సినీ నటుడు, టైం చూసుకోని రాజకీయాలు చేసే నాగబాబు మరోసారి తన నోటి పని చెప్పాడు. ఎప్పుడైనా తన అన్న, తమ్ముడు గురించి ఎవరైనా మాట్లాడితే వారికి కౌంటర్లు ఇచ్చే నాగబాబు ఈ సారి మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ పై ఘాటుగా రిప్లై ఇచ్చారు.
తమ్మారెడ్డి వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇస్తూ… ' ఎవరికి వారే ఇలా అనుకుంటున్నారు అని ఇంగ్లీష్ లో పెట్టి.. నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కోసం (ఆర్ఆర్ఆర్ మీద చేసిన కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)' అంటూ ట్వీట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.
రెండు రోజుల క్రితం తమ్మారెడ్డి ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. 'ఆస్కార్ అవార్డ్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బుతో మేము 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం. కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారు' అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ట్వీట్టర్ లో తమ్మారెడ్డికి కౌంటర్ ఇచ్చారు…'మిత్రుడు భరద్వాజ్ కి,తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి.. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ?' అంటూ సున్నితంగానే గట్టి జవాబు ఇచ్చారు.