చరణ్-వరుణ్ కు కరోనా.. నిహారిక పరిస్థితేంటి?

మెగా కాంపౌండ్ లో ఒకేసారి అటు రామ్ చరణ్, ఇటు వరుణ్ తేజ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ హోం క్వారంటైన్ లో ఉన్నారు. నిహారిక పెళ్లి తర్వాత జరిగిన సంబరాల్లో భాగంగానే…

మెగా కాంపౌండ్ లో ఒకేసారి అటు రామ్ చరణ్, ఇటు వరుణ్ తేజ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ హోం క్వారంటైన్ లో ఉన్నారు. నిహారిక పెళ్లి తర్వాత జరిగిన సంబరాల్లో భాగంగానే వీళ్లిద్దరికీ కరోనా సోకిందనే ప్రచారం మొదలైంది. రీసెంట్ గా జరిగిన క్రిస్మస్ సంబరాల్లో కూడా మెగా ఫ్యామిలీ సభ్యులంతా కలిసి పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో స్వయంగా నాగబాబు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. తన కూతురు నిహారిక, అల్లుడు చైతన్యకు కరోనా సోకలేదని ప్రకటించారు.

“ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం మాల్దీవులకు వెళ్లేముందు నిహారిక-చైతన్య పరీక్షలు చేయించుకున్నారు. తిరిగి ముంబయికి వచ్చినప్పుడు కూడా మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ రెండు రిపోర్టుల్లో ఇద్దరికీ కరోనా నెగెటివ్ వచ్చింది.”

ఇలా తన అల్లుడు-కూతురు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు నాగబాబు. రీసెంట్ గా నిహారిక-చైతన్య హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు

మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క