గోవాలో తన ప్రియుడితో అగ్రకథానాయిక నయనతార చెట్టపట్టాల్ అంటూ తిరుగుతోంది. తామెంతగా ఎంజాయ్ చేస్తున్నామో తెలియజేసే ఫోటోలను సోషల్ మీడియాలో ఆ జంట షేర్ చేయడం విశేషం. నయనతార, విఘ్నేష్ శివన్ గత కొన్ని నెలలుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.
నయనతార ప్రేమ జీవితంలో అనేక మలుపులున్నాయి. అవన్నీ అలా ఉంచితే విఘ్నేష్ శివనే తనకు సర్వస్వం అన్నట్టు వ్యవహరిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు కదల్లేని స్థితిలో మాత్రం ఈ జంట చెన్నైలోనే గడిపింది. కేరళకు చెందిన నయనతార ఇటీవల ఓనమ్ ఉత్సవాలను పురస్కరించుకుని తన స్వస్థలానికి విఘ్నేష్ను తీసుకెళ్లింది.
తన ఊళ్లో సంప్రదాయ వస్త్రాల్లో ప్రియుడితో కలిసి ఆటపాటలతో అందర్నీ అలరించింది. అనంతరం ఈ జంట ప్రేమ జీవితాన్ని ఆస్వాదించేందుకు సరికొత్త స్పాట్ను ఈ జంట ఎంచుకుంది. తాజాగా ఈ జంట గోవాలో విహరిస్తూ ప్రేమ మైకంలో ఉంది.
ఈ సందర్భంగా విఘ్నేష్శివన్ తన ఇన్స్టాగ్రామ్లో నయనతార ఫొటోను షేర్ చేశారు. ‘నయనతారకు ఎంతో ఇష్టమైన గోవాకు రావడం ఆనందంగా ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత గోవాకు రావడం కొత్త అనుభూతినిస్తోంది’ అని విఘ్నేష్శివన్ పేర్కొన్నాడు. ప్రేమలో ఉన్న ఆనందం పెళ్లిలో లేదు కాబోలు. అందుకే ఈ జంట ప్రేమ పక్షులుగా ఉండిపోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టుంది.