భార్యాభర్తలుగా మారిన నయనతార-విఘ్నేష్

మొన్నటివరకు ప్రేమికులు, ఇవాళ్టి నుంచి భార్యభర్తలు. సౌత్ సెలబ్రిటీ లవర్స్ నయనతార, విఘ్నేష్ శివన్ ఓ ఇంటివారయ్యారు. ఈ రోజు ఉదయం గ్రాండ్ గా జరిగిన వివాహ వేడుకలో నయన్ మెడలో తాళి కట్టాడు…

మొన్నటివరకు ప్రేమికులు, ఇవాళ్టి నుంచి భార్యభర్తలు. సౌత్ సెలబ్రిటీ లవర్స్ నయనతార, విఘ్నేష్ శివన్ ఓ ఇంటివారయ్యారు. ఈ రోజు ఉదయం గ్రాండ్ గా జరిగిన వివాహ వేడుకలో నయన్ మెడలో తాళి కట్టాడు విఘ్నేష్. 

కలర్ ఫుల్ గా జరిగిన ఈ పెళ్లిసందడికి కోలీవుడ్ కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ ప్రత్యేక అతిథిగా నిలిచాడు. ప్రస్తుతం నయన్ తో షారూక్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మహాబలిపురంలోని ఓ రిసార్ట్ హోటల్ లో గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్లి వేడుకకు షారూక్, రజనీకాంత్ తో పాటు.. దర్శకుడు మణిరత్నం, కార్తి, సూర్య, విజయ్ సేతుపతి, శరత్ కుమార్, రాధిక, ఎస్ జే సూర్య, కేఎస్ రవికుమార్, అనిరుధ్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత నయన్-విఘ్నేష్ మంటపం నుంచి కిందకొచ్చి రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్నారు.

తమ పెళ్లి సందర్భంగా నయన్-విఘ్నేష్ జంట రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది నిరుపేదలు, అనాథలకు భోజనాలు ఏర్పాటుచేశారు. కొన్ని దేవాలయ్యాల్లో అన్నదానాలతో పాటు, అనాథాశ్రయాల్లో వేలాది మందికి భోజనాలు పెట్టారు.

దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు నయన్-విఘ్నేష్. గతేడాది వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈరోజు పెళ్లితో ఒకటైంది ఈ జంట. నయన్ ను పెళ్లాడిన వెంటనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు విఘ్నేష్. తాళి కట్టిన తర్వాత ప్రేమతో ముద్దాడిన ఫొటోను కూడా విడుదల చేశాడు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది నయనతార.