కొండపై ముద్దులు.. వివాదాస్పదమైన ఓంరౌత్

ఎవరికైనా వీడ్కోలు పలికేటప్పుడు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం కామన్. పైగా ఇప్పటి కల్చర్ లో ఇది సర్వసాధారణం. అయితే స్థలాన్ని బట్టి ఈ పద్ధతి మారాలి. రెస్టారెంట్, పబ్స్ లో చేసే పనులు తిరుమల…

ఎవరికైనా వీడ్కోలు పలికేటప్పుడు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం కామన్. పైగా ఇప్పటి కల్చర్ లో ఇది సర్వసాధారణం. అయితే స్థలాన్ని బట్టి ఈ పద్ధతి మారాలి. రెస్టారెంట్, పబ్స్ లో చేసే పనులు తిరుమల కొండపై చేస్తే ఎలా? అందుకే ఓం రౌత్ ఇప్పుడు విమర్శలపాలవుతున్నాడు.

ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నాడు ఓం రౌత్. అతడితో పాటు హీరోయిన్ కృతి సనన్ కూడా శ్రీవారి సేవలో పాల్గొంది. బయటకు వచ్చిన తర్వాత ఎవరి కారులో వాళ్లు వెళ్లిపోవాలి. పైగా కృతికి ఫ్లయిట్ టైమ్ అవుతుంది.

దీంతో ఆమెకు సెండాఫ్ ఇచ్చాడు ఓంరౌత్. ముందుగా కౌగిలించుకున్నాడు, ఆ తర్వాత బుగ్గపై ముద్దుపెట్టాడు, ఆ తర్వాత ఓ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ సహజమే. కాకపోతే తిరుమల క్షేత్రంపై ఇలాంటి బిహేవియర్ సరికాదు.

నిజానికి ఓంరౌత్ ఇది కావాలని చేయలేదు. సినిమా జనాల్లో ఇది కామన్. అతడు కూడా అలానే ప్రవర్తించాడు. కానీ ఆ టైమ్ లో కొండపై  ఉన్నాననే విషయాన్ని అతడు మరిచిపోయాడు. నెటిజన్లు దీన్ని తప్పుపడుతున్నారు. ఓంరౌత్ ను ట్రోల్ చేస్తున్నారు. 

ఆదిపురుష్ సినిమా తీశాడు ఓంరౌత్. అందులో రాఘవ్ గా ప్రభాస్ నటిస్తే, జానకిగా కృతి సనన్ చేసింది. 16న థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ.