Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఛారిటీ కోసం సహాయం చేయమంటున్న హీరోయిన్

ఛారిటీ కోసం సహాయం చేయమంటున్న హీరోయిన్

కరోనా బాధితులకు సహాయం చేసేందుకు హీరోయిన్ నిధి అగర్వాల్ ఆన్ లైన్ పోర్టల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికోసం ఆమె ఓ టీమ్ ను ఏర్పాటుచేసుకుంది. తన శక్తికొద్దీ సహాయం చేయడం ప్రారంభించింది. అయితే ఆమె పోర్టల్ కు సహాయం కోసం వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువైంది. అందరికీ తను సహాయం చేయలేకపోతున్నానని, తనకు సహకారం అందించాలని కోరుతోంది నిధి అగర్వాల్.

"మా పోర్టల్ కు వచ్చే ప్రతి విజ్ఞప్తిని మా టీమ్ వెరిఫై చేస్తుంది. నిజంగా సహాయం కావాలనుకునేవాళ్లకు మేం సహాయం అందిస్తాం. అది ధన రూపంలో కావొచ్చు, వస్తు రూపంలో కావొచ్చు. వాళ్లకు ఎలాంటి సహాయం కావాలంటే అది అందుతుంది. అయితే మరింతమంది సహాయాన్ని ఆశిస్తున్నారు. కాబట్టి మేం కూడా మా ఛారిటీకి సహాయం చేయమని ఇతరుల్ని అడుగుదాం అనుకుంటున్నాం."

నిధి అగర్వాల్ కు చెందిన బంధువులు కరోనా బారిన పడ్డారు. వాళ్ల కష్టాల్ని కళ్లారా చూసిన తర్వాత కరోనా రోగులకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ వెబ్ పోర్టల్ ఏర్పాటుచేసింది నిధి. డిస్ట్రిబ్యూట్ లవ్ పేరిట ఏర్పాటైన ఈ పోర్టల్ లో మనకు ఏం అవసరమో చెబితే.. వాళ్లు తెచ్చి ఇస్తారు. 

నిత్యావసరాల నుంచి మందుల వరకు ఏదైనా ఇస్తారు. అవసరమైతే హాస్పిటల్ లో చేర్పించే బాధ్యత కూడా తీసుకుంటారు. ఇవన్నీ చేయడం తన ఒక్కరి వల్ల కావడం లేదంటోంది నిధి అగర్వాల్. 

తన ఛారిటీ సంస్థకు సహాయం చేయమని కోరుతోంది. కరోనా రోగుల కంటే కరోనా నుంచి కోలుకొని, ఇతర ఆరోగ్య-ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లే తనను ఎక్కువగా కాంటాక్ట్ అవుతున్నారని చెబుతోంది నిధి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?