Advertisement

Advertisement


Home > Movies - Movie News

నిర్మాతలుగా అఖిల్-చైతన్య

నిర్మాతలుగా అఖిల్-చైతన్య

అక్కినేని యంగ్ హీరో నిర్మాతగా మారుతున్నారు. అన్నపూర్ణ బ్యానర్ నే వుంటుంది. నిర్మాతగా అఖిల్-చైతన్య ల పేర్లు వుండే అవకాశం వుంది. ఈ సినిమా నిర్మాణం మాత్రం బోగవిల్లి బాపినీడు చూసుకుంటారు.

నిర్మాతగా ఆయన పేరు కూడా వుంటుంది. ఇప్పటి వరకు అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున పేరు నిర్మాతగా కనిపిస్తూ వస్తోంది. ఇప్పుడు అఖిల్-చైతూల పేర్లు నిర్మాతలుగా కనిపించబోతున్నాయి.

కబడ్డీ నేపథ్యంలో తయారయ్యే ఈ సినిమాకు స్క్రిప్ట్ ను పృధ్వీ అనే కొత్త యువ దర్శకుడు అందిస్తున్నాడు. ఇతగాడు అన్నపూర్ణ పిలిం ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. 

వాస్తవానికి ఈ కథ చైతూ కోసం చేసుకున్నది. కానీ చైతూకి ఖాళీ లేక, మంచి కథ వదలలేక నిర్మాతగా మారుతున్నాడు. వైష్ణవ్ తేజ్ ను హీరోగా తీసుకుంటున్నారు.

అన్నపూర్ణ బ్యానర్ సినిమా నిర్మాణ వ్యవహారాలు బయటవారు చూడడం ఇదే తొలిసారి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?