Advertisement

Advertisement


Home > Movies - Movie News

కరోనాతో సినిమా థియేటర్ కొచ్చిన హీరోయిన్

కరోనాతో సినిమా థియేటర్ కొచ్చిన హీరోయిన్

కరోనా పాజిటివ్ వస్తే ఎవరైనా హోం ఐసొలేషన్ లో ఉంటారు. లేదంటే హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటారు. కానీ హీరోయిన్ నివేత థామస్ మాత్రం కరోనా పెట్టుకొని సినిమా హాల్ కు వచ్చింది. వకీల్ సాబ్ సినిమా చూసింది. అక్కడితో ఆగలేదు. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టింది.

ఏప్రిల్ 3న తనకు కరోనా సోకినట్టు పోస్ట్ పెట్టింది నివేత. ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని, అందరూ విధిగా పరీక్షలు చేసుకోవాలని కోరింది. ఆ తర్వాత వకీల్ సాబ్ రిలీజ్ కు ముందు రోజు మరో పోస్ట్ పెట్టింది. అందరూ మాస్కులు వేసుకొని థియేటర్ కు రావాలని కోరింది.

ఇలా అందరికీ అన్ని రకాల జాగ్రత్తలు చెప్పిన నివేత.. తనకు కరోనా సోకిన వారం రోజులకే థియేటర్లలో ప్రత్యక్షమైంది. జనాలంతా ఆసక్తిగా సినిమా చూస్తున్న స్టిల్ ను పోస్ట్ చేసింది. "ఈ మూమెంట్ కోసమే జీవిస్తున్నానంటూ" క్యాప్షన్ తగిలించింది.

నివేతకు కరోనా తగ్గిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. తనకు తగ్గిపోయిందని, నెగెటివ్ వచ్చిందనే విషయాన్ని కూడా నివేత ఎక్కడా ప్రస్తావించలేదు. అంతలోనే ఇలా థియేటర్లలో ప్రత్యక్షమైంది. అయితే ఆమె ప్రేక్షకుల మధ్య కూర్చోలేదు. పైన నిల్చొని మాత్రమే సినిమా చూసింది. ఆడియన్స్ కు కాస్త దూరంగానే ఉంది. అయినప్పటికీ కరోనా పెట్టుకొని ఇలా బయటకు రావడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?