Advertisement

Advertisement


Home > Movies - Movie News

సున్నాలు చుట్టిన హీరోలు

సున్నాలు చుట్టిన హీరోలు

ఈ ఏడాదిలో పలువురు అగ్ర హీరోలు బాక్సాఫీస్‌ వద్ద అటెండెన్స్‌ వేయించుకోలేదు. అతి కొద్ది మంది అగ్ర హీరోలుండగా ఈసారి ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ యాక్షన్‌లోకి దిగలేదు. ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ ఆర్‌ చిత్రంతో బిజీగా వున్నాడు కనుక ఈ ఏడాది సినిమా విడుదల కాలేదు. అందుకే రాజమౌళి చిత్రానికి తన వర్క్‌ పూర్తి కాగానే త్రివిక్రమ్‌తో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు.

అల్లు అర్జున్‌ అయితే 'నా పేరు సూర్య' తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. త్రివిక్రమ్‌ కోసం ఎదురు చూపులలోనే ఆరు నెలలు గడిపేసిన అల్లు అర్జున్‌ ఆ తర్వాత కథ ఓకే చేయడానికి కూడా చాలా సమయం తీసుకోవడంతో ఈ ఏడాది మిస్‌ అయిపోయాడు. సంక్రాంతికి 'అల వైకుంఠపురములో'తో రాబోతోన్న అల్లు అర్జున్‌ వచ్చే ఏడాదిలోనే సుకుమార్‌తో చేసే చిత్రాన్ని కూడా విడుదల చేసి ఈ ఏడాది రిలీజ్‌ లేని లోటు తీర్చుకోవాలని భావిస్తున్నాడు.

అలాగే నితిన్‌ కూడా ఈ ఏడాది మిస్‌ అయిపోయాడు. వరుసగా మూడు పరాజయాలు వచ్చిన నేపథ్యంలో 'భీష్మ' స్టార్ట్‌ చేయడానికి నితిన్‌ మీన మేషాలు లెక్కపెట్టాడు. దాంతో డిసెంబర్‌ రిలీజ్‌ కూడా మిస్‌ అయిపోయాడు. నెక్స్‌ట్‌ ఇయర్‌ భీష్మతో పాటు రంగ్‌దే, ఏలేటితో చేసే చిత్రాన్ని కూడా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేసుకున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?