యాంక‌ర్‌తో స‌హా ప్ర‌ముఖుల‌కు నోటీసులు

శాండిల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ కేసు విచార‌ణ వేగ‌వంత‌మైంది. తీగ లాగితే డొంక క‌దులుతున్న చందంగా క‌ర్నాట‌క చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక్కొక్క‌రి గుట్టు ర‌ట్టు అవుతోంది. డ్ర‌గ్స్ కేసులో ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీల‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్…

శాండిల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ కేసు విచార‌ణ వేగ‌వంత‌మైంది. తీగ లాగితే డొంక క‌దులుతున్న చందంగా క‌ర్నాట‌క చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక్కొక్క‌రి గుట్టు ర‌ట్టు అవుతోంది. డ్ర‌గ్స్ కేసులో ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీల‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. విచార‌ణ‌లో భాగంగా సెల‌బ్రిటీలు చెప్పిన వివ‌రాల మేర‌కు జాబితా రూపొందించి …విడ‌త‌ల వారీగా విచార‌ణ సాగిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో యాంక‌ర్‌తో స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల‌కు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వాళ్లంతా నేడు (శనివారం) విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు. సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసిన వాళ్ల‌లో న‌టుడు, యాంక‌ర్ అకుల్‌ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే ఆర్‌వీ దేవరాజ్‌ మగ ఆర్‌ వీ.యువరాజ్, నటుడు సంతోషకుమార్ ఉన్నారు.

విచార‌ణ నిమిత్తం త‌మ కార్యాల‌యానికి హాజరు కావాలని సీసీబీ పోలీసులు సూచించినట్లు జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. మొత్తానికి శాండిల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ విచార‌ణ క‌ల‌క‌లం రేపుతోంది. ఎప్పుడు ఎవ‌రికి నోటీసులు వ‌స్తాయోన‌నే ఆందోళ‌న నెల‌కొంది.

జడ్జీల కూతుర్లు కూడా చట్టంముందు సమానులే