హరిహర వీరమల్లు.. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ వంతు

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక్కొక్కరుగా సైడ్ అవుతున్నారు. కొత్త వాళ్లు వచ్చి చేరుతున్నారు. మొన్నటికిమొన్న ఈ సినిమా నుంచి డైరక్టర్ క్రిష్ కాస్త పక్కకు జరిగాడు. అతడి…

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక్కొక్కరుగా సైడ్ అవుతున్నారు. కొత్త వాళ్లు వచ్చి చేరుతున్నారు. మొన్నటికిమొన్న ఈ సినిమా నుంచి డైరక్టర్ క్రిష్ కాస్త పక్కకు జరిగాడు. అతడి పర్యవేక్షణలో మరో  దర్శకుడితో మిగతా సినిమా పూర్తి చేయబోతున్నారు.

అంతకంటే ముందు ఈ సినిమా నుంచి అర్జున్ రాంపాల్ తప్పుకున్నాడు. కీలకమైన ఔరంగజేబు పాత్ర కోసం అతడ్ని ఎంపిక చేశారు. షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యమౌతుండడంతో, అతడు డ్రాప్ అయ్యాడు. అతడి స్థానంలో బాబీ డియోల్ ను తీసుకున్నారు.

ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి డీవోపీ జ్ఞానశేఖర్ తప్పుకున్నాడు. అతడి స్థానంలోకి మనోజ్ పరమహంస వచ్చి చేరాడు. తమ ప్రాజెక్టులో కొత్తగా మనోజ్ వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్‌ తో మనోజ్ పరమహంస చర్చిస్తున్న ఒక ఫోటోని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది.

మొన్నటివరకు ఈ సినిమా టైటిల్స్ లో జ్ఞానశేఖర్ పేరు మాత్రమే కనిపించింది. ఈ మధ్యనే మనోజ్ పరమహంస పేరును కూడా యాడ్ చేశారు. త్వరలోనే లొకేషన్ రెక్కీ నిర్వహించి, కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతోంది.

హరిహర వీరమల్లు సినిమాను 2 భాగాలుగా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగాన్ని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేస్తామని మరోసారి ప్రకటించింది యూనిట్. అటు ఓజీ కూడా సెప్టెంబర్ నుంచి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు సినిమాల్లో పవన్ నుంచి ఏ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందనే చర్చ మొదలైంది.