నరేష్ – ర‌మ్య ఎపిసోడ్ లో మ‌రో ట్విస్ట్!

టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ న‌రేష్ – ర‌మ్య ర‌ఘ‌ప‌తి ఎపిసోడ్ లో రోజుకు ఒక ట్విస్టులు బ‌య‌ట ప‌డుతున్నాయి. ర‌మ్య.. న‌రేష్ పై చేసిన‌ తీవ్ర ఆరోప‌ణ‌లు మరచి పోక ముందే..  ర‌మ్య‌పై సంచ‌ల‌న…

టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ న‌రేష్ – ర‌మ్య ర‌ఘ‌ప‌తి ఎపిసోడ్ లో రోజుకు ఒక ట్విస్టులు బ‌య‌ట ప‌డుతున్నాయి. ర‌మ్య.. న‌రేష్ పై చేసిన‌ తీవ్ర ఆరోప‌ణ‌లు మరచి పోక ముందే..  ర‌మ్య‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ కోర్టును ఆశ్ర‌యించారు సీనియ‌ర్ న‌టుడు న‌రేష్. పెళ్లెన త‌ర్వాతి నెల నుంచే ర‌మ్య న‌న్ను వేధించేద‌ని, ఇప్పుడు త‌న‌ను చంపేందుకు త‌న ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిష‌న్ వేశారు.

త‌న భార్య ర‌మ్య త‌న‌ను చంప‌డానికి క‌ర్నాట‌క‌కు చెందిన రౌడీ షీట‌ర్ తో రెక్కి చేయించింద‌ని.. అలాగే ఓ పోలీస్ ఆఫీస‌ర్ సాయంతో త‌న ఫోన్ హ్యాక్ చేసింద‌ని.. ర‌మ్య బంధువు అయిన మాజీ మంత్రి ర‌ఘ‌వీరారెడ్డి పేరుతో బెదిరింపుల‌కు దిగుతోంద‌ని, 10 కోట్ల రూపాయిలు ఇస్తే సెటిల్ మెంట్ చేసుకుంటానంటూ మ‌ధ్య‌వ‌ర్తితో బేర‌సారాలు చేసింద‌ని న‌రేష్ తీవ్ర ఆరోప‌ణ‌లు గురిపించారు.

సీనియర్ దిగ్గజ న‌టి విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నరేష్ గతం లో హీరోగా నటించి మంచి హిట్లు అందుకున్నారు. వృత్తిపరంగా నరేష్ కెరియర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఇప్ప‌టికే మూడు పెళ్లిలు చేసుకోని ఇద్ద‌రితో విడాకులు తీసుకున్న, మూడో భార్య‌ ర‌మ్య‌తో విడాకులు తీసుకోవాడ‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. 

గ‌త కొంత కాలంగా న‌రేష్ త‌న సహచర న‌టి ప‌విత్ర‌తో క‌లిసి ఉంటున్నారు. ఇటీవ‌లే న‌రేష్- ప‌విత్ర‌లు పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఓపెన్ గా ప్రక‌టించ‌డం అంద‌రికి తెలిసిందే.