జబర్దస్త్ నుంచి మరో వికెట్ డౌన్

ఒకప్పుడు జబర్దస్త్ లో మహిళలు కనిపించేవారు కాదు. పురుషులే మహిళా గెటప్స్ లో స్కిట్స్ చేసేవారు. అది కూడా అప్పట్లో ప్లస్ అయింది. అలా జబర్దస్త్ లో చాలా ఎపిసోడ్స్ లో అమ్మాయిగా కనిపించిన…

ఒకప్పుడు జబర్దస్త్ లో మహిళలు కనిపించేవారు కాదు. పురుషులే మహిళా గెటప్స్ లో స్కిట్స్ చేసేవారు. అది కూడా అప్పట్లో ప్లస్ అయింది. అలా జబర్దస్త్ లో చాలా ఎపిసోడ్స్ లో అమ్మాయిగా కనిపించిన సాయితేజ, ఈసారి నిజంగానే మహిళగా మారిపోయింది. అవును.. సెక్స్ మార్పిడి చేయించుకొని తన పేరును పింకీగా మార్చుకుంది. 

అలా మహిళగా మారిన సాయితేజ్ అలియాస్ పింకీ కూడా ఇప్పుడు జబర్దస్త్ కు బై చెప్పేసింది.తను నాగబాబుతో కలిసి పనిచేస్తానని ప్రకటించింది పింకీ. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగుతో కలిసి అదిరింది అనే కార్యక్రమాన్ని రూపొందించారు నాగబాబు. ధన్ రాజ్, వేణు, ఆర్పీ, చంద్ర టీమ్ లీడర్స్ గా ఈ కార్యక్రమం తెరకెక్కుతోంది. వీళ్లలో ఒకరి టీమ్ లో పింకీ చేరబోతోంది.

జబర్దస్త్ కు పోటీగా వస్తోంది అదిరింది అనే కార్యక్రమం. ఇప్పటికే ఈ ప్రొగ్రామ్ కు సంబంధించి గతవారం కర్టన్ రైజర్ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. ఇందులో ఎలాంటి కొత్తదనం ఆశించనక్కర్లేదు. జబర్దస్త్ ను మక్కికిమక్కి ఫాలో అయి చేసిన కార్యక్రమం ఇది.కాకపోతే జబర్దస్త్ తో పోలిస్తే.. ఇందులో జడ్జీలు, యాంకర్లు ఒకరికి ఇద్దరు కనిపిస్తారంతే. ఈ ఆదివారం ప్రసారమయ్యే మొదటి ఎపిసోడ్ లో నాగబాబుతో పాటు నిహారిక, రాజ్ తరుణ్ ప్రత్యేక అతిథులుగా కనిపించబోతున్నారు.

ఇక జబర్దస్ట్ విషయానికొస్తే.. తను మల్లెమాలతోనే కొనసాగుతానని సుడిగాలి సుధీర్ ఇప్పటికే స్పష్టంచేశాడు. అటు రష్మి కూడా మల్లెమాలకే కమిట్ అయినట్టు ప్రకటించింది. హైపర్ ఆదికి మాత్రం మరో 6 నెలలు అగ్రిమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జబర్దస్త్ లోనే కొనసాగాలా లేక నాగబాబు దగ్గరకు వెళ్లాలా లేక పూర్తిగా సినిమాలకే పరిమితం అవ్వాలా అనేది ఆయన ఆలోచించుకుంటాడు.