పండగ సినిమాలు కుమ్మేసాయి

పండగ వెళ్లి పదిరోజులు అయిపోయింది. అయినా ఈ ఆదివారం నైజాంలో తెలుగుసినిమాలు కుమ్మేసాయి. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రెండూ భారీగా వసూళ్లు సాగించాయి. అలవైకుంఠపురములో సినిమా నైజాంలో ఈ ఆదివారం రెండు…

పండగ వెళ్లి పదిరోజులు అయిపోయింది. అయినా ఈ ఆదివారం నైజాంలో తెలుగుసినిమాలు కుమ్మేసాయి. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రెండూ భారీగా వసూళ్లు సాగించాయి. అలవైకుంఠపురములో సినిమా నైజాంలో ఈ ఆదివారం రెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. 

అల వైకుంఠపురములో సినిమా జీఎస్టీతో కలిపి నైజాంలో 40 కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. సరిలేరు సినిమా కూడా ఈ ఆదివారం కోటికి పైగా వసూలు చేసింది.  వీటితో పాట వచ్చిన ఎంత మంచి వాడవురా, ఈవారం విడుదలయిన డిస్కోరాజా కూడా మంచి వసూళ్లు కళ్ల చూసాయి.

ఇదిలా వుంటే అఫిషియల్ గా అలవైకుంఠపురం సాధించిన రికార్డులను ఈరోజు ప్రకటించబోతున్నారు. ఇప్పటికే రంగస్థలం, సైరా (సీడెడ్ మినహా) రికార్డులు అన్నీ దాటేసింది. నాన్ బాహుబలి రికార్డును స్వంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మీడియా మీట్ పెట్టి, వివరాలు అందించబోతున్నారు.

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' స్పెషల్ ఇంటర్వ్యూ

సైరా లాస్ ఎంత?