Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎట్టకేలకు పరశురామ్ కు ఓ దారి దొరికింది

ఎట్టకేలకు పరశురామ్ కు ఓ దారి దొరికింది

గీతగోవిందం.. ఈ సినిమా వచ్చి చాన్నాళ్లయింది. ఆ మూవీ తర్వాత మరో సినిమా చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాడు పరుశురాం. ఒక దశలో మహేష్ బాబు వరకు కూడా వెళ్లాడు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు నాగచైతన్య హీరోగా సినిమా ఛాన్స్ అందుకున్నాడు పరశురాం. ఈరోజు ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నాగచైతన్య-పరశురామ్ కాంబినేషన్ లో సినిమా లాక్ అయింది. ఈ విషయాన్ని ఆ బ్యానర్ అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ మూవీ 40 శాతం మాత్రమే పూర్తయింది. ఫిబ్రవరి వరకు ఈ సినిమా పనిమీదే ఉంటాడు చైతూ.

గీతగోవిందం సక్సెస్ తర్వాత గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లోనే పరశురాం తన నెక్ట్స్ మూవీ చేయాలి. కానీ అనుకోని కారణాల వల్ల ఆ బ్యానర్ నుంచి బయటకొచ్చి, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై సినిమా చేయబోతున్నాడు. నిజానికి పరశురామ్-చైతూ సినిమా చాన్నాళ్ల కిందటే ఓకే అయింది. కాకపోతే బడ్జెట్ లెక్కలు తేలకపోవడంతో ఇన్నాళ్లూ అధికారికంగా సినిమాను ప్రకటించలేదు.

ఎట్టకేలకు 14రీల్స్ ప్లస్ నిర్మాతలకు, పరశురామ్ కు మధ్య డీల్ సెట్ అయింది. అటు నాగచైతన్య కూడా ఈ సినిమాతో తన కెరీర్ లోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి రష్మికను తీసుకోవాలనుకుంటున్నాడు పరశురాం. అదే కనుక జరిగితే ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?