పాత వైరములు సమసిపోయెను

రాజకీయాల్లో, సినిమాల్లో శతృత్వం, స్నేహం శాశ్వతంగా వుండవు. జనసేనలో ఇప్పుడు కొత్తగా చేరిన నిర్మాత భోగవిల్లి ప్రసాద్ ఉదంతం చూసుకుంటే అదే పాయింట్ మరోసారి ప్రూవ్ అవుతుంది.  Advertisement అత్తారింటికి దారేది సినిమా విడుదలకు…

రాజకీయాల్లో, సినిమాల్లో శతృత్వం, స్నేహం శాశ్వతంగా వుండవు. జనసేనలో ఇప్పుడు కొత్తగా చేరిన నిర్మాత భోగవిల్లి ప్రసాద్ ఉదంతం చూసుకుంటే అదే పాయింట్ మరోసారి ప్రూవ్ అవుతుంది. 

అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే లీక్ అయింది. నిర్మాత భోగవిల్లి ప్రసాద్ ఆసుపత్రిలో చేరిపోయారు. కిందా మీదా పడి సినిమా విడుదలైంది. ఆ తరువాత మళ్లీ అదే హీరోతో కానీ అదే దర్శకుడితో కానీ ఇప్పటి వరకు భోగవిల్లి ప్రసాద్ సినిమా చేయలేదు. ఎందుకని?

దీనికి మీద చాలా గ్యాసిప్ లు వున్నాయి ఇండస్ట్రీలో. కొన్ని డబ్బుల లావాదేవీలు మిగిలిపోయాయని. ఆ మేరకు మధ్యవర్తులను పంపించి, కొన్ని చెక్కుల మీద సంతకాలు తీసుకున్నారని, బకాయి కింద ఓ కారు ను అప్పగించేలా వత్తిడి చేసారని వదంతలు వున్నాయి. 

ఇవన్నీ ఎంత వరకు నిజం అన్నది తెలియదు కానీ, ఇన్నేళ్లుగా అటు త్రివిక్రమ్ లేదా ఇటు పవన్ తో భోగవిల్లి ప్రసాద్ కలిసిన వైనం ఎప్పుడూ లేదు. అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే వున్నారు కానీ మళ్లీ ఆ కాంబినేషన్ లేదు. 

ఇదిలా వుంటే జనసేనలో చేరేందుకు నిర్మాత ప్రసాద్ గత ఆరు నెలలుగా అడుగుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికి అకేషన్ కుదిరింది. చేరారు. వెస్ట్ గోదావరి కి చెందిన భోగవిల్లి ప్రసాద్ చాలా సీనియర్ నిర్మాత. శోభన్ బాబు కాలం నుంచీ సినిమాలు చేస్తున్నారు.