పవన్-కేటీఆర్‌…ఒకే వేదికపైకి

జనసేన లీడర్..హీరో పవన్ కళ్యాణ్, తెరాస యువరాజు కేటీఆర్‌ ఒకే వేదిక మీదకు వస్తున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా కేటిఆర్ రాబోతున్నారు. అయితే ఏంటీ? హైదరాబాద్ లో…

జనసేన లీడర్..హీరో పవన్ కళ్యాణ్, తెరాస యువరాజు కేటీఆర్‌ ఒకే వేదిక మీదకు వస్తున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా కేటిఆర్ రాబోతున్నారు. అయితే ఏంటీ? హైదరాబాద్ లో పంక్షన్…కేటీఆర్‌ కన్నా స్పెషల్ ఎవరు వుంటారు. కానీ అక్కడ వేరే వ్యవహారం వుంది.

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భాజపా స్ట్రాంగ్ సపోర్టర్. కేటిఆర్ పూర్తిగా రివర్స్. తెల్లవారి లేస్తే చాలు, భాజపాపై నిప్పులు కురిపిస్తారు. ఇప్పుడు ఈ ఉప్పు..ఆ నిప్పు..రెండూ ఒక వేదికపైకి రాబోతున్నాయి.

ఆఫ్ కోర్స్. ఇది సినిమా ఫంక్షన్..అక్కడ రాజకీయాలు వుండవు. జస్ట్ సినిమాలు మాత్రమే వుంటాయి. పైగా ఎక్కడ ఎలాంటి ప్రసంగం చేయాలి అనే దాంట్లో కేటీఆర్‌ స్పెషలిస్ట్. 

ఆయన ఎక్కడా ఒక్క పదం తేడా మాట్లాడరు. కానీ సమస్య పవన్ తోనే. ఆయన ఎక్కడో ప్రారంభించి ఎక్కడికో వెళ్లిపోతారు. అది కంట్రోలు చేయాలి. లేదంటే సమస్య.