భవదీయుడు కాస్తా ఉస్తాద్ గా మారాడు!

మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ప్రకటన వచ్చేసింది. కొన్ని రోజులుగా డిస్కషన్ పాయింట్ గా ఉన్న పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు సంబంధించి హఠాత్తుగా ప్రకటన చేసింది మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ…

మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ప్రకటన వచ్చేసింది. కొన్ని రోజులుగా డిస్కషన్ పాయింట్ గా ఉన్న పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు సంబంధించి హఠాత్తుగా ప్రకటన చేసింది మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. ఈసారి టైటిల్ మార్చి పోస్టర్ వేసింది.

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ఇదివరకే భవదీయుడు భగత్ సింగ్ పేరిట ఎనౌన్స్ మెంట్ వచ్చింది. దానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టుగా దాని స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్ పేరిట ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. గతంలో పోస్టర్ కోసం చేసిన ఫొటోషూట్ స్టిల్స్ లోంచే మరో స్టిల్ తీసి ఈరోజు రిలీజ్ చేశారు.

తాజా పోస్టర్ చూస్తుంటే, అప్పటి కథతోనే కొత్త మార్పులతో సినిమా చేయబోతున్నారనే విషయం అర్థమౌతోంది. ఇందులో భాగంగానే టైటిల్ కూడా మార్చినట్టు కనిపిస్తోంది.

మొత్తానికి పవన్-హరీశ్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. “మనల్ని ఎవడ్రా ఆపేద” అంటూ పోస్టర్ లో ట్యాగ్ లైన్ కూడా ఇచ్చిన యూనిట్, త్వరలోనే షూటింగ్ అంటూ ప్రకటించేసింది. ఈ ప్రాజెక్టుకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తాడు.

ఓవైపు ప్రాజెక్టు ప్రకటించినప్పటికీ మరోవైపు “వుట్ డోంట్ వాంట్ తేరీ రీమేక్” అనే ట్రెండ్ మాత్రం నడుస్తూనే ఉంది. తమకు రీమేక్ వద్దని, ఓ కొత్త కథ కావాలంటూ పవన్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ పై స్పందిస్తున్నారు.