ఆ హీరోయిన్ పై కవితలు రాసిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ఓ హీరోయిన్ పై కవితలు రాశారంటే, ఆమె ఎంత అందగత్తె అయి ఉండాలి. ఆమె ఎంతలా పవన్ ను ఎట్రాక్ట్ చేసి ఉండాలి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? టాలీవుడ్ నటి…

పవన్ కల్యాణ్ ఓ హీరోయిన్ పై కవితలు రాశారంటే, ఆమె ఎంత అందగత్తె అయి ఉండాలి. ఆమె ఎంతలా పవన్ ను ఎట్రాక్ట్ చేసి ఉండాలి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? టాలీవుడ్ నటి జ్యోతి. తనపై పవన్ కల్యాణ్ కవితలు రాశావరని.. తన వాలు జడను, ఓర చూపును వర్ణిస్తూ చాలా రాశారని చెప్పుకొచ్చింది జ్యోతి.

“పవన్ కల్యాణ్ నాపై కవిత్వాలు రాసేవారు. అవి నాకు పంపించేవారు. నా వాలుజడపై, పక్క నుంచి చూసే చూపులపై రాసేవారు. అంత పెద్ద హీరో నాపై కవితలు రాస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. ఆయనతో నటించేటప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. అదంతా సెట్స్ లో సరదాగా జరిగేది. అలా సెట్స్ లో చాలామంది నన్ను ట్రై చేసేవారు. అంతా పైపైన ఫ్లర్టింగ్ టైపు అన్నమాట. ఎవరూ పర్సనల్ గా తీసుకోలేదు.”

కుదిరితే పవన్ తో మరోసారి నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది జ్యోతి. మరోవైపు తన వ్యక్తిగత విషయాలపై కూడా స్పందించింది. తన భర్త తన నుంచి విడిపోయాడని, ఆ టైమ్ లో కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటోంది.

“ఆ కేసు ఇంకా నడుస్తోంది. నాకు ఆయన ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మాకు బాబు ఉన్నాడు. కనీసం బాబు సంరక్షణ కోసమైనా డబ్బు ఇవ్వలేదు. అన్నీ నేనే చూసుకుంటున్నాను. అతడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. మరో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు కూడా. కానీ నేను మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. లైఫ్ లో దెబ్బతిన్న తర్వాత మళ్లీ ఆ డేర్ స్టెప్ తీసుకోవాలనిపించలేదు. వచ్చిన వాడు ఎలా ఉంటాడో? నా బాబును చూసుకుంటాడో లేడో? ఇవన్నీ ఎందుకని పెళ్లి గురించి ఆలోచించలేదు.”

జ్యోతి కూడా కరోనా బారిన పడింది. కేర్ హాస్పిటల్ లో కరోనా వార్డులో ఒంటరిగా గడిపింది. దీంతో తనకు కూడా తోడు ఉంటే బాగుండేదని అనిపించిందని చెప్పుకొచ్చింది. గతంలో తను ఎప్పుడూ డేటింగ్ చేయలేదని, ఈసారి మాత్రం మంచి అబ్బాయి దొరికితే డేటింగ్ కు రెడీ అని ప్రకటించింది.