Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ ను కలవనున్న ఫైనాన్షియర్!

పవన్ ను కలవనున్న ఫైనాన్షియర్!

టాలీవుడ్ లో అందరికీ జాలి కలుగుతోంది నిర్మాత ఎఎమ్ రత్నం మీద. గొప్ప గొప్ప సినిమాలు అవలోకగా తీసిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ ఇచ్చి ఏన్నాళ్లయిందో, హరి హర వీరమల్లు సినిమా మొదలుపెట్టి ఎన్నాళ్లయిందో. 

పాపం ఫైనాన్స్ వడ్డీలు కట్టుకుంటూ, ఇప్పటికి 50శాతం సినిమా పూర్తి చేయగలిగారు. సినిమా ఎప్పుడు షూట్ వుంటుందో, ఎప్పుడు షూట్ వుండదో, అసలు హీరో ఎప్పుడు వస్తారో..ఎప్పుడు రారో తెలియకుండా నిద్రలేని రాత్రులు గడపడం అంటే నరకం కాక మరేంటీ?

ఇలాంటి టైమ్ లో రత్నం కోసం ఒకరిద్దరు ఫైనాన్సియర్లు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరగా సినిమా ఫినిష్ చేసి రత్నం ను ఆదుకోవాలని కోరే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఓ సీనియర్ ఫైనాన్సియర్ పవన్ దగ్గర తనకు వున్న చనువును వాడి, కాస్త త్వరగా సినిమా ఫినిష్ చేయాలని కోరాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

సమస్య ఏమిటంటే పవన్ కు అటు పొలిటికల్ యాక్టివిటీలు, ఇటు సినిమా షూటింగ్ లు రెండూ వుండడం. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకు మధ్యలో త్రివిక్రమ్ వున్నారు కనుక ఏదో విధంగా త్వరగా పూర్తి అయిపోయాయి. ఇక్కడ త్రివిక్రమ్ లేరు. 

ఇంకా యాభై శాతం షూట్ బకాయి వున్న హరి హర వీరమల్లు సినిమాను చకచకా ముందుకు నడిపించడానికి ఈ ఫైనాన్సియర్ల రికమెండేషన్ లు పనికి వస్తాయా? ఏమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?