Advertisement

Advertisement


Home > Movies - Movie News

క్వారంటైన్ నుంచి నేరుగా సెట్స్ పైకి...!

క్వారంటైన్ నుంచి నేరుగా సెట్స్ పైకి...!

అందరూ ఊహించినట్టుగానే జరుగుతోంది. జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అజ్ఞాతాన్ని వీడబోతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పూర్తిగా తన ఫామ్ హౌజ్ కే పరిమితమైన పవన్ కల్యాణ్, అట్నుంచి అటు నేరుగా సినిమా సెట్స్ పైకి రాబోతున్నారు. ఈ మేరకు నిర్మాతలకు కాల్షీట్లు సర్దుబాటు చేశారు.

పవన్ ముందుగా స్టార్ట్ చేయబోయే సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్. ఈ సినిమాకు జులై రెండో వారం నుంచి కాల్షీట్లు కేటాయించారు పవన్. ఈ గ్యాప్ లో యూనిట్ లోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించాల్సిందిగా నిర్మాతకు సూచించారు. వ్యాక్సిన్ డ్రైవ్ పూర్తయిందని నిర్థారించుకున్న తర్వాతే సెట్స్ పైకి వస్తానని క్లియర్ గా చెప్పేశారు.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేశారు. ఇదొక పోలీస్ స్టేషన్ సెట్. ఇందులోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈసారి పవన్ తో పాటు రానా కూడా జాయిన్ అవుతారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా టైటిల్ కూడా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.

ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నారు పవన్. లాక్ డౌన్ కు ముందే ఈ మూవీ కోసం ప్రత్యేకమైన సెట్ సిద్ధం చేశారు. లాక్ డౌన్ పడ్డంతో షూటింగ్ ఆపేశారు. ఇప్పుడీ సెట్ లోనే హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ పూర్తయిన తర్వాతే, హరీష్ శంకర్ సినిమాను ప్రారంభించబోతున్నారు పవన్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?