ప‌వ‌న్‌క‌ల్యాణ్ అలాంటోడా…

మెగా ప్రిన్సెస్ నిహారిక లాక్‌డౌన్‌ను బాగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె అభిమానుల‌తో చిట్‌చాట్ చేస్తున్నారు. లోకంలో జ‌రుగుతున్న వింత‌లు విశేషాల‌ను అభిమానుల నుంచి ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు. అలాగే త‌న…

మెగా ప్రిన్సెస్ నిహారిక లాక్‌డౌన్‌ను బాగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె అభిమానుల‌తో చిట్‌చాట్ చేస్తున్నారు. లోకంలో జ‌రుగుతున్న వింత‌లు విశేషాల‌ను అభిమానుల నుంచి ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు. అలాగే త‌న సినిమాలు, ప్రేమ‌, పెళ్లి, ఇత‌ర సంగ‌తుల‌పై అభిమానులు, నెటిజ‌న్లు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు దాప‌రికం లేకుండా స‌మాధానాలిస్తున్నారు.

మెగా కుటుంబంలో మిగిలిన హీరోల గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆమె సూటిగా, సుత్తి లేకుండా స‌మాధానాలు ఇస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. త‌న‌ బాబాయ్, జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి కూడా నిహారిక మాట్లాడారు. ఆయ‌న ఎలాంటోడో పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారామె. 

`పవన్ బాబాయ్ ఎక్కువగా మాట్లాడడు. మితభాషి. ఎప్పుడూ  ఏదో ఒక‌ పుస్తకం చదువుతూ తన లోకంలో తనుంటాడు. అలాంటి వ్యక్తి కొన్ని వేల మందిని ఉద్దేశించి వేదికలపై ప్రసంగాలు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతుంటాను. నిజంగా ఇంట్లో కామ్‌గా ఉండే బాబాయేనా మాట్లాడేది అని అనుమానం వ‌స్తుంది.  బాబాయ్ చాలా స్వచ్ఛమైన మనిషి. రాజకీయాల్లో అలాంటి నేత‌లు చాలా అరుదుగా ఉంటారు` అని నిహారిక చెప్పుకొచ్చారు.

మొత్తానికి నిహారిక ఒక్కొక్క‌రి గురించి త‌న‌దైన అవ‌గాహ‌న‌తో చెప్ప‌డం ముచ్చ‌టేస్తోంది. అందులోనూ ఎక్క‌డా మాట తూల‌కుండా అంచ‌నా వేసే తీరు ఆశ్చ‌ర్చ‌ప‌రుస్తోంది. 

నమస్కారమే మన సంస్కారం