Advertisement

Advertisement


Home > Movies - Movie News

పీపుల్స్ మీడియాకు ధైర్యం ఎక్కువే

పీపుల్స్ మీడియాకు ధైర్యం ఎక్కువే

ఒకసారి దెబ్బతిన్న తరువాత, తమ లాగే చాలా మంది చాలా దెబ్బలు తిన్నారని తెలిసిన తరువాత మళ్లీ అదే ప్రయత్నం చేయాలని సాధారణంగా అనుకోరు. కానీ పీపుల్స్ మీడియా సంస్థ మాత్రం ధైర్యం చేస్తోంది. డైరక్టర్ తేజ తో గతంలో ఇదే సంస్థ ఓ సినిమా చేసింది. దారుణంగా దెబ్బతిన్నారు. ఆ తరువాత తేజ కూడా సినిమాలు చేసారు. చాలా మంది నిర్మాతలు దెబ్బతిన్నారు. సీత అనే లేటెస్ట్ సినిమా ఎంతటి డిజాస్టర్ అనేది అందరికీ తెలిసిందే.

ఇలాంటి నేపథ్యంలో పీపుల్స్ మీడియా ఓ సినిమాను తేజ డైరక్షన్ లో చేయబోతోంది. తేజ బర్త్ డే సందర్భంగా ప్రకటించిన రెండు టైటిళ్లలో ఒకటి పీపుల్స్ మీడియాదే. తేజ డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా సినిమా. అసలు గోపీచంద్ నే బాగా వెనకబడి వున్నారు. ఆయన ప్రస్తతం చేస్తున్న సీటీమార్ సినిమా హిట్ అయి తీరాల్సి వుంది. ఇలాంటి నేపథ్యంలో గోపీచంద్-తేజ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు పీపల్స్ మీడియా అంటే ధైర్యం చేయడమే.

పైగా తేజ అంత వీజీగా మాట వినరు అన్న టాక్ వుంది. సురేష్ బాబు లాంటి నిర్మాత అయితే ఏమో కానీ, మిగిలిన వారు తేజను కన్విన్స్ చేయగలగడం, తమ పాయింట్లు వినేలా చేయడం కష్టం. మరి పీపుల్స్ మీడియా ఈసారి ఎలా నెగ్గుకు వస్తుందో? గతంలోనే నానా కష్టాలు పడి కర్ణాటకలోని కష్టమైన ప్రాంతాల్లో షూట్ చేసారు. తేజ అంత మొండిగా వుంటారు. ఆయన అనుకున్నదే చేస్తారు. ఆయన అనుకున్నదే తీస్తారు. మరి ఈసారి ఏం చేస్తారో?

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?