నేను ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చాను

అమెరికాలో తనకు ఎదురైన ఓ మంచి జ్ఞాపకాన్ని ప్రేక్షకులతో పంచుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. కొంతమంది అమెరికన్లు కలిశారని, ఇండియా నుంచి వచ్చానని చెబితే.. “నువ్వు ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చావా” అని వాళ్లు…

అమెరికాలో తనకు ఎదురైన ఓ మంచి జ్ఞాపకాన్ని ప్రేక్షకులతో పంచుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. కొంతమంది అమెరికన్లు కలిశారని, ఇండియా నుంచి వచ్చానని చెబితే.. “నువ్వు ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చావా” అని వాళ్లు ప్రశ్నించినట్టు చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలంటోంది పూజా.

“నేను చూసిన వ్యక్తుల్లో చాలా మంచి వ్యక్తి ప్రభాస్. ఎప్పుడు చూసినా చాలా కూల్ గా ఉంటాడు. ప్రభాస్ ను ఎప్పుడు చూసినా నాకు ఒకటే అనిపిస్తుంది. బాహుబలి లాంటి పెద్ద సినిమా ప్రభాస్ లాంటి మంచి వ్యక్తికే దక్కింది. ప్రేక్షకులు ఇప్పుడు ప్రభాస్ ను ఇంటర్నేషనల్ స్టార్ గా చూస్తున్నారు. ఆ మధ్య అమెరికా వెళ్లినప్పుడు కొంతమంది నన్ను కలిస్తే ఇండియా నుంచి వచ్చానని చెప్పాను. వావ్.. నువ్వు ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చావా అని నన్ను అడిగారు. నేను షాక్ అయ్యాను.”

సినిమా బాగాలేకపోయినా ప్రేక్షకులు వచ్చి సినిమా చూస్తున్నారంటే దానికి కారణం స్టార్ డమ్ అని.. అలాంటి స్టార్ డమ్ ను సల్మాన్ తర్వాత ప్రభాస్ లోనే చూశానంటోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఆ మూవీ సంగతుల్ని షేర్ చేసింది.

“ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నాను. హిందీ, తెలుగు భాషల్లో తీస్తున్నారు. యూరోప్ లో ఓ దేశానికి చెందిన పీరియాడిక్ సినిమా ఇది. సినిమాలో నేను, ప్రభాస్ యూరోపియన్ స్టయిల్ లోనే కనిపిస్తాం. అప్పటి పాతకాలం దుస్తుల్నే ధరిస్తాం. ఇటలీలో ఎక్కువ భాగం షూట్ చేశాం. హైదరాబాద్ లో కొన్ని సెట్స్ వేశాం.”

ప్రభాస్ కు తనకు కామన్ పాయింట్ ఒకటి ఉందంటోంది పూజా. ఇద్దరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టమని, ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా కలిసి బిర్యానీ తింటామని అంటోంది. అందులో కూడా ఇద్దరం మటన్ బిర్యానీనే ఇష్టపడతామని చెబుతోంది.