బన్నీ రింగులు.. ప్రభాస్ వాచీలు

సినిమా షూటింగ్ టైమ్ లో ఖరీదైన బహుమతులు ఇచ్చుకునే సంస్కృతి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు చాన్నాళ్ల కిందటే వచ్చింది. బండ్ల గణేశ్ తో పాపులర్ అయిన ఈ కల్చర్ ను ఇప్పుడు దాదాపు…

సినిమా షూటింగ్ టైమ్ లో ఖరీదైన బహుమతులు ఇచ్చుకునే సంస్కృతి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు చాన్నాళ్ల కిందటే వచ్చింది. బండ్ల గణేశ్ తో పాపులర్ అయిన ఈ కల్చర్ ను ఇప్పుడు దాదాపు అందరు హీరోలు ఫాలో అయిపోతున్నారు. 

మొన్నటికిమొన్న హీరో అల్లు అర్జున్.. పుష్ప ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో పాటు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో కొందరికి బంగారు రింగులు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది.

ఆదిపురుష్ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభాస్ కూడా యూనిట్ లో కొంతమంది సభ్యులకు ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. డైరక్షన్ డిపార్ట్ మెంట్, కెమెరా డిపార్ట్ మెంట్ లోని కొంతమందిని ప్రత్యేకంగా తన కారవాన్ లోకి పిలిపించుకొని మరీ వాళ్లకు ఖరీదైన వాచీల్ని బహుమతులుగా అందించాడు.

ప్రభాస్ మంచి భోజనప్రియుడు. తను ఎక్కడుంటే అక్కడ ఆంధ్రా వంటకాల మెనూ రెడీ అయిపోతుంది. తనతో పాటు యూనిట్ లోని కీలకమైన సభ్యులందరికీ తనే దగ్గరుండి ఎన్నో వంటకాల్ని వడ్డిస్తుంటాడు ప్రభాస్. ఆదిపురుష్ యూనిట్ లో కూడా హీరోయిన్ కృతి సనన్ తో పాటు చాలామందికి భోజనాలు పెట్టాడు ప్రభాస్. ఈసారి అలా భోజనాలతోనే ఆగిపోకుండా, యూనిట్ లో కొంతమందికి వాచీలు గిఫ్టులుగా ఇచ్చాడు.

ఆదిపురుష్ యూనిట్ సభ్యులు కొంతమంది, ప్రభాస్ తో దిగిన ఫొటోల్ని, అందుకున్న గిఫ్టుల్ని సోషల్ మీడియాలో పెడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఆదిపురుష్ షూట్ పూర్తిచేసిన ప్రభాస్ ప్రస్తుతం, సలార్, ప్రాజెక్ట్-K సినిమాలపై దృష్టిపెట్టాడు. అతడు నటించిన రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.