Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లండి- ప్రభాస్‌

ప్రతి ఒక్కరూ భోజనం చేసి  వెళ్లండి- ప్రభాస్‌

ఇటీవ‌ల అనారోగ్య కారణాలతో మ‌ర‌ణించిన రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మం సందర్భంగా మొగల్తూరులో జన సంద్రాన్ని తలపించింది. సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భాస్ తో స‌హా కృష్ణం రాజు కుటుంబ స‌భ్యులు స్వ‌గృహంలో నిర్వ‌హించారు. 

కుటుంబ స‌మేతంగా మొగ‌ల్తూరు చేరుకున్న ప్ర‌భాస్ ను చూడ‌టానికి అభిమానులు పెద్ద ఎత్తున మొగ‌ల్తూరుకు త‌ర‌లి వ‌చ్చారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు రావడంతో.. ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ప్రభాస్ రాకతో అభిమానుల పెద్ద ఎత్తున్న సంద‌డి చేశారు. సెక్యూరిటీ దృష్ట్యా ప్రభాస్‌ తమ ఇంటిలో నుంచే అభిమానులకు అభివాదం చేసి, వారిలో ఉత్సాహం నింపారు. 

కార్య‌క్ర‌మ‌నికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ భోజ‌న‌లు చేసి వెళ్లాల‌ని ప్ర‌భాస్ అభిమానుల‌ను కోరారు. సంస్మరణ సభ నిమిత్తం వచ్చిన దాదాపు లక్షమంది అభిమానులకు ప్రభాస్ ఫ్యామిలీ భోజన ఏర్పాట్లు చేశారు.

Click Here For Photo Gallery

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?