Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రభాస్ విరాళం...కోటి

ప్రభాస్ విరాళం...కోటి

ప్రభాస్ బాహుబలిగా పాన్ ఇండియా హీరోగా మారిన దగ్గర నుంచి తగ్గేదే లే అన్నట్లు వున్నాడు. రాజుగారి చేయి పెద్ద చేయిగా మారిపోయింది. 

ఎప్పుడు విరాళం ఇవ్వాలన్నా కోట్లలోనే పలుకుతోంది. లేటెస్ట్ గా ఆంధ్రలో వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు బాహుబలి ప్రభాస్.

ఇప్పటికే గీతా సంస్థ, చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ, మహేష్, ఎన్టీఆర్ అందరూ తలా పాతిక లక్షలు విరాళం ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా హాట్ గా కోటి విరాళం ప్రకటించారు.

గతంలో కూడా ప్రభాస్ అనేక సార్లు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలకు భారీగా విరాళాలు ప్రకటించారు. పాన్ ఇండియా స్టార్ గా మారి, చేతిలో అయిదారు పెద్ద సినిమాలు వున్న ప్రభాస్ పారితోషికం ఇప్పుడు వందల కోట్లకు చేరుకుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?