Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

'ప్రసన్న వదనం' మేటరుంది

'ప్రసన్న వదనం' మేటరుంది

సుహాస్ జర్నీ వైవిధ్యంగా సాగుతోంది. తన నుంచి ఓ సినిమా వస్తుందంటే ఏదో కొత్త పాయింట్ ఉంటుందనే నమ్మకం. ఇప్పుడు 'ప్రసన్న వదనం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

తాజాగా ట్రైలర్ ని వదిలారు. ఫేస్ బ్లైండ్ నెస్ తో ఇబ్బంది పడే ఓ కుర్రాడి కథ ఇది. ఈ రుగ్మత వున్న వ్యక్తులు ముఖాన్ని గుర్తించలేరు. ఈ పాయింట్ తో క్రైమ్ థ్రిల్లర్ మలిచే ప్రయత్నం ఆసక్తికరంగా వుంది..

సుహాస్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లెస్ చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం గ్రిప్పింగ్ గా సాగింది. అద్దంలో తనని తాను చూసుకోలేని హీరో.. ఓ కేసులో పోలీసులకు సాయం చేయాలని అనుకోవడం, తిరిగి తానే మూడు మర్డర్ కేసుల్లో ఇరుక్కువడం, ఆ కేసుల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ కథపై చాలా క్యురియాసిటీని పెంచాయి.

సుహాస్ పెర్ఫర్మెన్స్, కొత్త దర్శకుడు అర్జున్ టేకింగ్ ప్రామెసింగ్ గా వున్నాయి. అన్నట్టు.. అర్జున్, సుకుమార్ స్కూల్ నుంచి వచ్చాడు. దీంతో ఖచ్చితంగా కంటెంట్ లో లాజిక్ వుండే అవకాశం వుంది. ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్స్ లో రావాలంటే కంటెంట్ లో ఎదో కొత్త పాయింట్ వుండాల్సిందే. ఆ పాయింట్ ప్రసన్న వదనంలో వుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. మే 3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?