Advertisement

Advertisement


Home > Movies - Movie News

పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలన్నదే కోరిక

పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలన్నదే కోరిక

ఎప్పటికైనా దర్శకుడు పూరి జగన్నాధ్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాలన్నది తన కోరిక అని హీరో కార్తికేయ అన్నారు. ఆర్ ఎక్స్ 100, గుణ సినిమాల తరువాత కార్తికేయ చేస్తున్న సినిమా 90 ఎమ్ ఎల్. ఈ సినిమా ఈవారం జనం ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో కార్తికేయ 'గ్రేట్ ఆంధ్ర'తో మాట్లాడారు.

ఆర్ఎక్స్ 100 తరువాత పెద్ద డైరక్టర్లతో చేయాలని వుండేదని, కొన్ని ఆఫర్లు వచ్చినా, సరైనవి రాలేదని, పూరి గారితో చేయాలని వుందని, సుకుమార్ గారితో కూడా చేయాలని వుందని ఆయన అన్నారు.

గ్యాంగ్ లీడర్ లో మంచి క్యారెక్టర్ దొరికింది, అలాంటివి దొరికితే చేయగలనని, తాను నేరుగా వెళ్లి హీరోయిన్ రేప్ చేసి, హీరో చేత తన్నులు తినే సీన్లు చేయలేనని, తనకు కెరీర్ కు ఉపయోగపడే పాత్రలు మాత్రం చేయాలని వుందని అన్నారు.

హుషారుగా వుండడం వరకు ఇష్టమే అని, అయితే గతంలో స్టేజ్ మీద కూడా షర్ట్ విప్పి, హడావుడి చేసి, ఆ తరువాత అనవసరంగా చేసాను అని మాత్రం అనుకున్నా అన్నారు.

90 ఎమ్ ఎల్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అని, ఇందులో క్రేజీ పాత్రలు వుంటాయని, కచ్చితంగా జనాలకు నచ్చుతుందని కార్తికేయ అన్నారు.

సెట్ మీద సరదాగా వుంటానని, హీరోయిన్ లతో స్నేహంగా వుండడమే తప్ప, అంతకు మించి ఏమీ వుండదని అన్నారు. ఇప్పటి వరకు అదృష్టం కొద్దీ ఏ గ్యాసిప్ రాలేదని అన్నారు.

ప్రస్తుతం ఓ సినిమా కొత్త దర్శకుడితో చేస్తున్నానని, త్వరలో ఓ పెద్ద బ్యానర్ లో సినిమా చేయబోతున్నానని, ఆ ప్రకటన ఆ బ్యానర్ నుంచే రావాల్సి వుందని కార్తికేయ అన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?