పూరి…ఇస్మార్ట్ శంకర్ 2 ?

దర్శకుడు పూరి జ‌గన్నాధ్ దృష్టి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 మీద పడిందా? ఈ మేరకు టాలీవుడ్ లో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. పూరి-విజ‌య్ ల జ‌నగణమన సినిమాను తాత్కాలికంగా పక్కన పెడుతున్నారని బలంగా…

దర్శకుడు పూరి జ‌గన్నాధ్ దృష్టి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 మీద పడిందా? ఈ మేరకు టాలీవుడ్ లో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. పూరి-విజ‌య్ ల జ‌నగణమన సినిమాను తాత్కాలికంగా పక్కన పెడుతున్నారని బలంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఇప్పటికే 20 కోట్ల వరకు ఖర్చు చేసేసారని వినిపిస్తోంది. అందుకే మధ్యే మార్గంగా ఓ కొత్త ప్లాన్లను ఆలోచిస్తున్నారని వినిపిస్తోంది.

అవేంటంటే… జ‌నగణమన నిర్మాణ భాగస్వాములు అయిన మై హోమ్ సంస్థకు పూరి ఇస్మార్ట్ శంకర్ 2 చేస్తారు. విజ‌య్ ఓ సినిమా వేరుగా చేస్తారు. ఆ విధంగా మై హోమ్ సంస్థకు బాకీ తీరుతుంది. ఇప్పటికే విజ‌య్ ఖుషీ సినిమా తరువాత దిల్ రాజుకు ఓ సినిమా చేయాల్సి వుంది. అది చాలా అంటే చాలా పాత బాకీ. 

మైత్రీ వాళ్ల సినిమా ‘హీరో’ ను పక్కన పెట్టేసినపుడు ఖుషీ సినిమా దిల్ రాజు నుంచి ఇటుకు మార్చినపుడు చేయాల్సిన సినిమా. దానికి అప్పట్లో అయితే ఇంధ్రగంటి దర్శకుడు అనుకుని కథ కూడా ఒకే చేసుకుని వున్నారు.

సో ఖుషీ తరువాత మైహోమ్ కు ఒకటి, దిల్ రాజుకు ఒకటి చేయాలన్న మాట. పూరి ఇస్మార్ట్ శంకర్ 2 చేసిన తరువాత జ‌నగణమన సినిమా గురించి ఆలోచిస్తారేమో? అయినా ఏమిటో పాపం, ఆ జ‌నగణమన సినిమా పూరికి అచ్చి వస్తున్నట్లు లేదు. ఏనాటి నుంచో అది తెరకెక్కించాలనుకుంటే ఏదో ఒక అడ్డంకి వస్తూనే వుంది.