హనీమూన్ తర్వాత పెళ్లి మేటర్

ఎట్టకేలకు రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంది. ఇన్నాళ్లూ వివాదాలు, బూతు పోస్టులతో కాలక్షేపం చేసిన 40 ఏళ్ల రాఖీ, బ్రిటన్ కు చెందిన ఎన్నారై బిజినెస్ మేన్ ను పెళ్లాడింది. తను పెళ్లి చేసుకున్న…

ఎట్టకేలకు రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంది. ఇన్నాళ్లూ వివాదాలు, బూతు పోస్టులతో కాలక్షేపం చేసిన 40 ఏళ్ల రాఖీ, బ్రిటన్ కు చెందిన ఎన్నారై బిజినెస్ మేన్ ను పెళ్లాడింది. తను పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా తనదైన స్టయిల్ లో బయటపెట్టింది. ముందుగా హనీమూన్ పిక్స్ ను బయటపెట్టి, ఆ తర్వాత పెళ్లయిందనే విషయాన్ని నిర్థారించింది.

బ్రిటన్ కు చెందిన భారతీయ వ్యాపారవేత్త రితేష్ ను రాఖీసావంత్ పెళ్లాడింది. లండన్ లోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ లో వీళ్లు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. అంతకంటే ఒకరోజు ముందు కోర్టులో వీళ్ల వివాహం అధికారికంగా జరిగింది.

చాన్నాళ్లుగా రితేష్ తనకు ఫ్రెండ్ అని చెబుతోంది రాఖీ సావంత్. తన ఫస్ట్ ఇంటర్వ్యూ చూసి రితేష్ తనకు అభిమానిగా మారాడని, అప్పట్నుంచి తామిద్దరం ఫోన్ లో టచ్ లోనే ఉంటున్నామని.. రితేష్ కు భార్యగా మారాలని ఆ దేవుడ్ని చాలాసార్లు ప్రార్థించానని, తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది రాఖీ సావంత్.

పెళ్లయినా తను ఇండియాలోనే ఉంటానని స్పష్టంచేసింది రాఖీ సావంత్. ఇకపై యూకే, ఇండియా మధ్య చక్కర్లు కొడతానని.. టీవీ కార్యక్రమాలు మాత్రం ఆపే ప్రసక్తి లేదని ప్రకటించింది. 3 రోజుల నుంచి తన హనీమూన్ ఫొటోలు షేర్ చేస్తున్న రాఖీ సావంత్, తాజాగా పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోల్ని పోస్ట్ చేస్తోంది. 

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్