రకుల్ ప్రీత్ ప్రేమ తుపాన్..?

కరోనా మూడో వేవ్ టైమ్ లో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది. కరోనా టైమ్ లో తామిద్దరం ఒకరికొకరు తోడుగా…

కరోనా మూడో వేవ్ టైమ్ లో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది. కరోనా టైమ్ లో తామిద్దరం ఒకరికొకరు తోడుగా ఉన్నామని, మరింత కలిసిపోయామని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రేమపక్షులు బయట కనిపించేది మాత్రం చాలా తక్కువ. దీంతో ఆమె రిలేషన్ షిప్ పై బాలీవుడ్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.

దాదాపు రెండేళ్ల కిందట తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది రకుల్. అయితే ఆ తర్వాత దాని గురించి ఆమె పెద్దగా మాట్లాడలేదు. ఓ సందర్భంలో మీడియాపై కాస్త అసహనం కూడా వ్యక్తం చేసింది. “రిలేషన్ షిప్ లో ఉండడం చాలా కామన్. మేం యాక్టర్లం అయినంత మాత్రాన ప్రత్యేకంగా ఏం ఉండదు. మేం ప్రేమలో ఉన్నామనే విషయం చెప్పేశాం. అక్కడితో అయిపోయింది. కానీ ప్రతిసారి మా ప్రేమ విషయమే టాపిక్ అయిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. మా ఎఫైర్ కంటే నా వర్క్ ఎక్కువగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను.” అంటూ కాస్త చిరాకు చూపించింది.

అప్పట్నుంచి మీడియా కూడా ఆమె లవ్ లైఫ్ పై ఫోకస్ పెట్టడం మానేసింది. అయితే బాలీవుడ్ మీడియా నుంచి తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రకుల్-జాకీ ప్రస్తుతం లవ్ లైఫ్ లో లేరంట, వాళ్లిద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారని, తరచుగా కలుసుకోవడం దాదాపు తగ్గించేశారని బాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వీటికి బలం చేకూరుస్తూ తాజాగా తన పెళ్లిపై నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసింది రకుల్. కొన్ని మీడియా సంస్థల్లో తన పెళ్లిపై వచ్చిన కథనాల్ని ఖండించింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని తెగేసి చెప్పింది. దీంతో రకుల్-జాకీ మధ్య ఏదో జరుగుతోందంటూ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. వాళ్లిద్దరూ కలిసి మీడియా కెమెరాలకు పోజులిచ్చేంత వరకు ఈ రూమర్స్ ఇలా కొనసాగుతూనే ఉంటాయి.