పంజాబ్‌లో గ్యాస్ లీక్.. తొమ్మిది మంది మృతి!

పంజాబ్‌లోని లూథియానాలో విషాదం చోటుచేసుకుంది. గియాస్‌పురా ప్రాంతంలోని గోయల్ మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీకైంది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది మృతి చెంద‌గా మ‌రో 11 మంది ఆసుప‌త్రి పాల‌య్యారు.  Advertisement ఈ…

పంజాబ్‌లోని లూథియానాలో విషాదం చోటుచేసుకుంది. గియాస్‌పురా ప్రాంతంలోని గోయల్ మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీకైంది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది మృతి చెంద‌గా మ‌రో 11 మంది ఆసుప‌త్రి పాల‌య్యారు. 

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందం అక్క‌డికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్యాస్‌ కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న వారిని అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించినట్టు లూథియానా అసిస్టెంట్‌ డీసీపీ సమీర్‌ వర్మ తెలిపారు.

ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. “లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటన చాలా బాధాకరం. పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. వారు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నారు” అని మన్ పంజాబీలో ట్వీట్ చేశారు.